ఎక్కడ చూసినా మానవత్వమే కనిపించాలి
అక్కడి ప్రజలు చావకూడదు. ఎక్కడ చూసినా మానవత్వమే కనిపించాలి. అక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు. అదెంతో ఘోరమైన పరిస్థితి. ఇది చాలా బాధాకరం. ఏ తెగ నుంచైనా.. ఏ మతమైనా ప్రాణాలు కోల్పోవడమనేది చిన్న విషయం కాదు. గతంలోనూ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ.. అక్కడ భారత్ అమలు చేస్తున్న విధానాన్ని అఫ్రిది విమర్శించిన సంగతి తెలిసిందే.
|
భారత మీడియా నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది
అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో ట్విట్టర్లో తన వ్యాఖ్యలను భారత మీడియా వక్రీకరించిందని అన్నాడు. తన ట్విట్టర్లో "భారత మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించింది. నా దేశం పట్ల మక్కువగా ఉన్నా, కాశ్మీరీల పోరాటాల విలువ తెలుసు. మానవత్వాన్ని కాపాడాలి, వారు వారి హక్కులను పొందాలి" అని ట్వీట్ చేశాడు.
|
అఫ్రిది వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ
మరోవైపు అఫ్రిది వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ "అఫ్రిది నిజమే చెప్పాడు అని, పాక్ తమ దేశాన్నే చూసుకోలేకపోతున్నది, ఇక కశ్మీర్ను ఏం చూసుకుంటుందని రాజ్నాథ్ అన్నారు. కశ్మీర్లో భారత్కు చెందిన భూభాగం అని, ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది" అని అన్నాడు.