లిరిక్స్ గుర్తుకు రాలేదు
‘‘ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ ‘తూ జానే నా' పాట పాడుతుండగా లిరిక్స్ గుర్తుకు రాలేదు. దీంతో 12వ ఆటగాడైన ఇషాంత్ను పిలిపించాను. లిరిక్స్ కోసం నా ఐపాడ్ తెమ్మన్నాను. అతను ఐపాట్ని తీసుకొచ్చాడు. అందరూ నేను అతణ్ని డ్రింక్స్ కోసం పిలిచాననుకున్నారు. 12వ ఆటగాడు కొన్నిసార్లు ఇలా కూడా ఉపయోగపడతాడు'' అని వీరూ తెలిపాడు.
షోయబ్ అక్తర్ను ఎదుర్కొనే సమయంలో
ఇక పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ను ఎదుర్కొనే సమయంలో ఏ పాట పాడేవాడివని అడిగితే ఆ దేఖే జరా.. కిస్మే కిత్నా మై దమ్.. అనే పాట అని ఠక్కున సమాధానమిచ్చాడు సెహ్వాగ్. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘‘ప్రతి బంతినీ ఎదుర్కొనే ముందు దాన్ని ఫోరో సిక్సో బాదాలన్న ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను మళ్లించడానికే పాట పాడుతుంటా'' అని సెహ్వాగ్ చెప్పాడు.
ట్విట్టర్లో సెకండ్ ఇన్నింగ్స్
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. ఇటీవలే ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దపై సెహ్వాగ్ అద్భుతమైన పంచ్ వేశాడు. బ్యాచిలరే ఇలాంటి మార్పు తీసుకురాగలడు. పెళ్లయిన వ్యక్తి ఇంటికి కూరగాయలు తేవడమో.. కుక్కను వాక్కు తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేడు అని తనదైన శైలిలో ట్వీట్ పోస్టు చేశాడు.
అంపైర్తో వాగ్వాదానికి దిగేవాడిని కాదు
అంతేకాదు తన పెళ్లి జీవితంపై కూడా ఇలాంటి జోకే వేశాడు. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్తో వాగ్వాదానికి దిగేవాడిని కాదు. ఎందుకంటే అంపైర్ మనల్ని ఎప్పుడైనా ఔట్ ఇవ్వొచ్చు. అలాగే ఇప్పుడు భార్యతోనూ వాదించను. అంపైర్ ఎప్పటికైనా దానిని మరచిపోతాడేమో కానీ.. భార్య మాత్రం మరవదు అంటూ ఇటీవల మధ్య కాలంలో ట్విట్టర్లో రెచ్చిపోతున్నాడు.