న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పుని సరిదిద్దుకున్నాడు: రవిశాస్త్రి ఎందుకిలా చేశావ్!

మ్యాచ్‌ అనంతరం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ను పిలిచి రవిశాస్త్రి మాట్లాడారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్‌లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

బెస్ట్ క్యాచ్ అందుకున్న ఆటగాడిగా పార్థీవ్ పటేల్‌

మ్యాచ్‌ అనంతరం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ను పిలిచి రవిశాస్త్రి మాట్లాడారు. ఆ తర్వాత బెస్ట్ క్యాచ్ అందుకున్న ఆటగాడిగా పార్థీవ్ పటేల్‌ పేరును ప్రకటించాడు.

అవార్డులు అందుకున్న మృణాల్ పాండ్యా, భజ్జీ

అవార్డులు అందుకున్న మృణాల్ పాండ్యా, భజ్జీ

అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మృణాల్ పాండ్యాను, స్టయిలిష్ ప్లేయర్‌గా హర్భజన్ సింగ్‌ను ప్రకటించడంతో వాళ్లిద్దరూ వచ్చి అవార్డులను అందుకున్నారు. అనంతరం జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుని ప్రకటించడం మాత్రం మర్చిపోయాడు.

‘మ్యాన్ ఆఫ్ ది అవార్డు'ను ప్రకటించడం మరిచిపోయిన అతను క్షమాపణలు చెప్పి, జస్పీత్ బూమ్రాకు ఆ అవార్డు అందజేయాలని ఆకాష్ అంబానీని కోరాడు. ఈ ఉదంతంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్లలో ఒకడైన్ పీటర్సన్‌, రవి శైలిని అనుకరిస్తూ సరదాగా ట్వీట్ చేశాడు. కేపీ జోక్‌ను రవిశాస్త్రి కూడా సరదాగా తీసుకుని ట్విట్టర్లో సమాధానమిచ్చాడు.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుని మరిచిపోయిన రవిశాస్త్రి

అనంతరం తప్పుని గుర్తించిన రవిశాస్త్రి వెంటనే తేరుకుని ఈ మ్యాచ్‌లో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించడంతో బుమ్రా వచ్చి అవార్డు అందుకున్నాడు. అయితే రవిశాస్త్రి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించడాన్ని మర్చిపోవడం ఇదే తొలిసారి కాదు.

2015లో కూడా ఇలా

2015లో కూడా ఇలా

2015లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 8 బంతుల్లోనే 12 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. అప్పట్లో కూడా పాండ్యా పేరుని పిలవడం రవిశాస్త్రి మర్చిపోయాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X