ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా వచ్చే నెలలో జరగనున్న ఫ్లేఆఫ్లకు వేదికలను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖరారు చేసింది. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్డేడియంలో మే 19న జరుగుతుంది.
మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక మే 20న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్కు పూణె ఆతిథ్యమిస్తుంది. మే 22న జరగనున్న రెండో క్వాలిఫయిర్ రాంచిలో జరుగుతుంది. క్వాలిఫయిర్ 1, ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 24న కోల్కత్తా జరుగుతున్న విషయం తెలిసిందే. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి.

ఐపీఎల్ 8వ ఎడిషన్ ప్లేఆఫ్స్ వేదికలు:
19 మే (మంగళవారం) (8 PM) - క్యాలిఫయిర్ 1
పాయింట్ల పట్టిలో మొదటి జట్టు Vs రెండవ జట్టు (Wankhede Stadium, Mumbai)
రిజర్వ్ డే: 20 May - (4 PM)
20 మే (బుధవారం) (8 PM) - ఎలిమినేటర్
పాయింట్ల పట్టిలో మూడవ జట్టు Vs నాల్గవ జట్టు (MCA International Stadium, Gahuje, Pune)
రిజర్వ్ డే లేదు
22 మే (శుక్రవారం) (8 PM) - క్వాలిఫయిర్ 2
క్వాలిఫయిర్లో ఓడినవారు v ఎలిమినేటర్ గెలిచినవారు (JSCA International Stadium Complex, Ranchi)
రిజర్వ్ డే లేదు
24 మే (ఆదివారం) - (8 PM) - ఫైనల్
క్వాలిఫయిర్ 1లో గెలిచినవారు v క్వాలిఫియర్ 2లో గెలిచినవారు - Eden Gardens, Kolkata
రిజర్వ్ డే: 25 మే - (8 PM)