
పాకిస్థాన్ క్రికెట్ ఎంత క్రూరమైనదో..?
ఈ ఏడాది ప్రారంభంలో.. మహమ్మద్ హఫీజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మాలిక్కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయాలని సూచించినట్లు కూడా హఫీజ్ చెప్పాడు. 'నేను నా రిటైర్మెంట్ ప్రకటించే టైంలో షోయాబ్ మాలిక్ను కూడా రిటైర్మెంట్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే అతనికి ఇక జట్టులో గౌరవం దక్కదని నాకు తెలుసు. అది నా విషయంలో కూడా స్పష్టంగా జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఏమిటంటే.. అతను చివరిగా ఒక్కసారి జట్టు తరఫున ఆడాలని కోరుకున్నాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్ ఇంత క్రూరమైనదో అది జరగడమే లేదు' అంటూ హాఫీజ్ పేర్కొన్నాడు.

జట్టు మేనేజ్మెంట్ది లోపాయికార స్వభావం
2019లో షోయాబ్ మాలిక్ చివరిసారిగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో మహమ్మద్ హఫీజ్ కూడా ఆడాడు. ఇకపోతే మూడేళ్ల క్రితమే మాలిక్కు వీడ్కోలు మ్యాచ్ను పీసీబీ ఏర్పాటు చేసి ఉండాల్సిందని హఫీజ్ పేర్కొన్నాడు. 'దురదృష్టవశాత్తు అతను వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. అతనికి వన్డే ఫార్మాట్లో వీడ్కోలు మ్యాచ్ అవకాశం మాత్రం దక్కలేదు. ఇన్నేళ్ల పాటు జట్టుకు అతని సేవలను గ్రహించి.. అతనికి వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాల్సింది. గొప్ప ప్లేయర్లకు వీడ్కోలు చెప్పేటప్పుడు మా జట్టు మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా లోపాయికారిగానే వ్యవహరించింది.' అని హఫీజ్ తెలిపాడు.

షోయాబ్ మాలిక్ కెరీర్..
షోయాబ్ మాలిక్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక చివరిసారిగా అతను జాతీయ జట్టు తరఫున 2021నవంబరులో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఆడాడు. ఆ తర్వాత అతనికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు షోయాబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్లో 35 టెస్టులు ఆడాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. మాలిక్ 12 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సహాయంతో టెస్టుల్లో 1898 పరుగులు, వన్డేల్లో 7534పరుగులు, టీ20ల్లో 2435పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












