|
చివరి టెస్ట్లో విశ్వరూపాన్ని
పర్యటనలో తనదైన స్లెడ్జింగ్తో హాట్టాపిక్గా నిలిచిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. చివరి టెస్ట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో సెంచరీ బాదేసి.. ఆసీస్ గడ్డపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇలా తొలి భారత వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసిన పంత్.. నోటితోనే కాదు బ్యాట్తోనూ బదులివ్వగలనని చాటి చెప్పాడు.
|
పంత్ బీభత్సానికి తోడు ఓ బ్యాండ్ కూడా
సిడ్నీలో పంత్ బీభత్సానికి తోడు అతనికి మద్ధతుగా ఓ బ్యాండ్ సందడి చేసింది. ఆసీస్ అభిమానులను వెక్కిరించేలా చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మాకు పంత్ దొరికాడు. అంటూ పాట పాడుతూ ఓ సంగీత కచేరీ బృందం సిడ్నీ స్టేడియంలో సందడి చేసింది. మాకు పంత్ దొరికాడు. రిషబ్ పంత్. మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అతను సిక్సులు కొడతాడు. మీ పాపల్ని ఆడిస్తాడు. మాకు పంత్ దొరికాడు.' అంటూ కాసేపు అభిమానులందరికీ వినోదాన్ని పంచింది.
|
137 బంతుల్లో సెంచరీ చేసేసి
దూకుడైన ఆటను ప్రదర్శించి వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 137 బంతుల్లో సెంచరీ చేయడం గమనార్హం. ఇప్పటి వరకూ తొమ్మిది టెస్టులు ఆడిన పంత్కు ఇది రెండో టెస్టు సెంచరీ. ఇలా భారత వికెట్ కీపర్లలో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు మాత్రమే కాకుండా.. పర్యాటక జట్లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు చేసిన పంత్.. రెండు పర్యటనలలోనూ సెంచరీ దాటేశాడు.