
T20 ప్రపంచ కప్ 2022 సూపర్-12లో భాగంగా ఈనెల 22న భారత్, పాకిస్థాన్ తో తలపడనుంది. మ్యాచ్ కు ముందు బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో ప్రాక్టీస్ చేశారు. ఫాస్ట్ బౌలింగ్ ద్వయం మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షాలకు పాకిస్థాన్ జట్టు మెంటర్ మాథ్యూ హేడెన్ త్రో ఛాలెంజ్ ఇచ్చాడు. హేడెన్ వసీం, షా బాల్ను 'స్టేడియం పైన' విసిరితే వంద డాలర్లు వాచ్ని అందిస్తానని చెప్పాడు. తాను బంతిని స్టేడియం వెలుపలికి విసరగలనన్న నమ్మకం ఉందని వసీమ్ చెప్పాడు కానీ అది కుదరలేదు.
బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్
2022 T20 ప్రపంచ కప్కు ముందు సోమవారం ఇంగ్లాండ్తో జరిగిన వార్మప్ గేమ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ మిస్ ఫైర్ కావడంతో మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు ఆడకపోయినా, పాకిస్తాన్ XIలో షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ వంటి స్టార్లు ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 160/8 స్కోరు చేసింది. అయితే ఇంగ్లాండ్ కేవలం 14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
ఫిట్నెస్
పాకిస్థాన్ ఆటగాళ్లపై మాజీ కెప్టెన్ మిస్బా పలు వ్యాఖ్యలు చేశారు. "క్లియర్ కట్, ఫిట్నెస్ సమస్యలు కనిపిస్తున్నాయి. షోయబ్ మాలిక్,యూనస్ ఖాన్ వంటి ఆటగాళ్లు చాలా ఫిట్నెస్లో దృష్టి పెట్టేవాళ్లు. ఇప్పుడున్న పాక్ ఆటగాళ్లు పొట్టలతో కనిపిస్తున్నారు"
అని మిస్బా చెప్పాడు.