న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

50 బంతుల్లో సెంచరీ సాధించే సత్తా ఉంది: కేఎల్ రాహుల్‌కు గంభీర్ ప్రశంస

KL Rahul Can Score Century In 50-Balls In Test Cricket Says Gautam Gambhir
‘He can get a 50-ball 100 in Tests,’ Gautam Gambhir’s huge praise for India batsman after Indore T20I against Sri Lanka

హైదరాబాద్: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరిస్‌లో ఓపెనర్‌గా కొనసాగుతున్న టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో 50 బంతుల్లో సెంచరీ సాధించే సత్తా అతడికి ఉందని గంభీర్‌ కొనియాడాడు.

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

ఇండోర్ టీ20.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడో చెప్పిన కోహ్లీ!!ఇండోర్ టీ20.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడో చెప్పిన కోహ్లీ!!

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శనపై గంభీర్ మాట్లాడుతూ "కేఎల్‌ రాహుల్ అద్భుతఫామ్‌లో ఉన్నాడు. అతడు టెస్టుల్లో సైతం అలా ఎందుకు ఆడట్లేదని నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రమే కాదు అతడు టెస్టుల్లో కూడా అదరగొట్టాలి. టెస్టుల్లో 50 బంతుల్లోనే 100 పరుగులు సాధించే సత్తా ఉన్న ఆటగాడు" అని గంభీర్ అన్నాడు.

కేఎల్ రాహుల్ షాట్లు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటాయని గంభీర్ తెలిపాడు. ఓపెనర్‌గా రోహిత్‌శర్మకు ధావన్‌ను పంపించడం కంటే కేఎల్ రాహుల్ అయితే బాగుంటుందని గంభీర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. గంభీర్ మాట్లాడుతూ "ఐపీఎల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌తో పోల్చకూడదు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడేటప్పుడు మీకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎవరూ ఉండరు" అని అన్నాడు.

ఇది డామ్ సిబ్లే కథ: మనవడిపై తాత నమ్మకం లక్షలు తెచ్చిపెట్టింది!ఇది డామ్ సిబ్లే కథ: మనవడిపై తాత నమ్మకం లక్షలు తెచ్చిపెట్టింది!

"అదే దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు మీ స్థానం కోసం ఎంతో మంది ఆటగాళ్లు పోటీ పడుతుంటారు. ఒత్తిడి కూడా ఉంటుంది. శ్రీలంక మ్యాచ్‌లో ఎవరు అద్భుత ఫామ్‌లో ఉన్నారనేది మనం చూశాం. రాహుల్ అద్భుతమైన ఆటగాడు. దేశవాళీ సయ్యద్‌ ముస్తాక్ అలీ, విజయ్‌ హజారె టోర్నీలు ఆడాడు" అని గంభీర్ తెలిపాడు.

దేశవాళీ టోర్నీలు ఆడటం ద్వారా తన ఆటతీరుని మరింతగా మెరుగుపర్చుకున్నాడని గంభీర్ పేర్కొన్నాడు. కాగా, ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక నిర్దేశించిన 143 విజయ లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఒకేరోజు రెండు హ్యాట్రిక్‌లు: బిగ్‌బాష్ లీగ్‌ చరిత్రలోనే మొదటిసారి (వీడియో)ఒకేరోజు రెండు హ్యాట్రిక్‌లు: బిగ్‌బాష్ లీగ్‌ చరిత్రలోనే మొదటిసారి (వీడియో)

ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌(45; 32 బంతుల్లో 6 పోర్లు), శిఖర్‌ ధావన్‌(32; 29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం చేసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.

Story first published: Wednesday, January 8, 2020, 18:05 [IST]
Other articles published on Jan 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X