ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా
మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలుస్తాడు. 2004 డిసెంబర్లో కోల్కతాలో భారత్తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ఆమ్లా, ఇన్నేళ్లలో సఫారీలు సాధించిన అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్లలో అతను 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు.
25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు
ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున నమోదైన ఏకైక ట్రిపుల్ సెంచరీ హషీమ్ ఆమ్లా పేరిట ఉండటం గమనార్హం. టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మొదటి ఆరు ఇన్నింగ్స్లలో కలిపి 62 పరుగులు చేశాడు.
రెండేళ్ల పాటు జట్టుకు దూరం
ఇలా 15 టెస్టుల తర్వాత కూడా ఆమ్లా యావరేజి 25.50గా ఉంది. దీంతో జట్టుకు రెండేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న తర్వాత తన ఆటతీరుతో దక్షిణాఫ్రికా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో భాగమయ్యాడు.
మత విశ్వాసాలను సైతం పాటిస్తాడు
ఆమ్లా వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. మత విశ్వాసాలను పాటించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు జెర్సీపై లిక్కర్ కంపెనీ బ్రాండ్ను ప్రదర్శించేందుకు తిరస్కరించిన సమయంలో తొలిసారి ఆమ్లా గురించి ప్రపంచానికి తెలిసింది. ఒకానొక సందర్భంలో అతని పెద్ద గడ్డాన్ని చూసి కామెంటేటర్ డీన్జోన్స్ ‘టెర్రరిస్ట్' అని సంబోధించాడు.
తనపై విమర్శలకు బ్యాట్తోనే సమాధానం
అయితే ఆమ్లా మాత్రం వీటన్నింటినీ పట్టించుకోలేదు. తనపై విమర్శలు చేసిన వారికి తన ఆటతీరుతోనే సమాధానమిచ్చాడు. వివాదాలకు ఎప్పడూ దూరంగా ఉంటాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా... శ్రీలంకను వైట్ వాష్పై చేయాలని భావిస్తోంది.