హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ భారత్కు చెందిన షమీయా అర్జూను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20న వీరి వివాహం దుబాయిలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
టీ20ల్లో పాకిస్థాన్ రికార్డుని సమం చేసిన టీమిండియా
ఈ నేపథ్యంలో తన పెళ్లికి రావాలంటూ టీమిండియా క్రికెటర్లను సైతం హసన్ అలీ ఆహ్వానించనున్నట్లు తెలిపాడు. "భారత క్రికెట్ జట్టును, ఆటగాళ్లను నా పెళ్లికి ఆహ్వానిస్తా. దుబాయిలో జరిగే ఈ పెళ్లికి భారత క్రికెటర్లు వస్తే చాలా సంతోషిస్తా' అని కరాచీలోని ఓ న్యూస్ పేపర్కు ఇచ్చిన ఇంటర్యూలో హసన్ అలీ అన్నాడు.
"మా మధ్య పోరు మైదానంలోనే కానీ బయట కాదు. ఏది ఏమైనప్పటికీ మేమంతా ప్రొపెషనల్ క్రికెటర్లమే కదా. ఆనందాలను షేర్ చేసుకుంటే మంచిది" అని హసన్ అలీ తెలిపాడు. 26 ఏళ్ల సమియా హర్యానాలోని నుహ్ (మేవాట్) జిల్లా చందేని గ్రామానికి చెందినది.
ధోనీని మరపించిన రిషబ్ పంత్: చప్పట్లు కొడుతూ అభినందించిన కోహ్లీ
ఆమె తండ్రి లియాఖత్ అలీ హర్యానాలోని బ్లాక్ డెవల్మెంట్ ఆఫీసర్గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఫరీదాబాద్లో నివాసం ఉంటున్నారు. కాగా, షమీయా భారత్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్కు వెళ్లారు. అనంతరం ఫ్లైట్ ఇంజనీర్గా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం దుబాయ్లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. షమీయా అర్జూతో తన వివాహాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దాంతో రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే బహిరంగ ప్రకటన చేశానని హసన్ అలీ చెప్పుకొచ్చాడు.