ఈ ఏడాది వన్డేల్లో 1200 పరుగులు చేసిన కోహ్లీ
మూడో స్థానాన్ని కట్టబెట్టిన కెప్టెన్ కోహ్లీ ఈ ఏడాది వన్డేల్లో 1200 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండటం విశేషం. ఇంగ్లాండ్ క్రికెటర్లు జో రూట్, జోస్ బట్లర్కు నాలుగు, ఐదు స్థానాలను కట్టబెట్టాడు. వికెట్ కీపర్గా మాత్రం మహేంద్ర సింగ్ ధోనీకి చోటివ్వలేదు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు హర్షా భోగ్లేపై మండిపడుతున్నారు.
ధోనీ, హర్షా భోగ్లే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
2016 నుంచి ధోనీ, హర్షా భోగ్లేకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. బంగ్లాతో ఓ మ్యాచ్లో భారత్ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నా.. వ్యతిరేకంగా మాట్లాడటంతో అప్పట్లో హర్షా భోగ్లేపై బిగ్బి అమితాబ్ బచ్చన్ సైతం విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత బీసీసీఐ.. హర్షా భోగ్లేని కామెంటేటర్ ఫ్యానల్ నుంచి ఏడాది పాటు తప్పించిన సంగతి తెలిసిందే.
వన్డే జట్టు
హర్షా భోగ్లే 2018 వన్డే జట్టు:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్(ఓపెనర్లు)
కెప్టెన్: విరాట్ కోహ్లీ
జో రూట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్)
షకీబ్ అల్ హసన్, తిసార పెరీరా (ఆల్ రౌండర్లు)
రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ (స్పిన్నర్లు)
కాగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా (ఫాస్ట్ బౌలర్లు)