
కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్..
లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్ విఫలమైంది. టోర్నీ అంతా అద్భుతంగా రాణించిన స్మృతి మంధాన ఈ మ్యాచ్లో ఫెయిలైంది. ఇలాంటి సమయంలో జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరూ భారత జట్టును ఆదుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ హర్మన్ప్రీత్ కౌర్ అవుటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రెండో పరుగు తీసే సమయంలో ఆమె బ్యాట్ నేలలో దిగబడి ముందుకు జారలేదు. దీంతో ఆమె రనౌట్ అయ్యి పెవిలియన్ చేరింది. చివర్లో భారత్ ఓడిపోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

ఇంత కన్నా దురదృష్టం లేదు..
ఈ ఓటమి గురించి మ్యాచ్ అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది. ‘ఇంత కన్నా దురదృష్టం ఉంటుందని అనుకోవడం లేదు. జెమీతో కలిసి ఆడేటప్పుడు మ్యాచ్ మా వైపే ఉందని అనుకున్నా. అలాంటి పరిస్థితి నుంచి ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. అలా రనౌట్ అవడం కన్నా దురదృష్టకర ఘటన మరొకటి నా జీవితంలో జరగలేదు. అయితే చివరి బంతి వరకు పోరాడినందుకు సంతోషిస్తున్నా. మొదటి రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా.. మా దగ్గర బ్యాటింగ్ ఉందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పుకొచ్చింది.
జెమీమాను మెచ్చుకోవాలి..
అలాగే మ్యాచ్ మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడిన మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్(43)ను మెచ్చుకుంది. ‘మ్యాచ్ను మా వైపు తిప్పినందుకు జెమీమాను మెచ్చుకోవాలి. ఆమె మా జట్టుకు మొమెంటం తీసుకొచ్చింది. ఓవరాల్గా మేం మంచి క్రికెట్ ఆడాం. మేం కూడా ఛేజ్ చేయాలనే అనుకున్నాం. కాబట్టి టాస్ ఓడి బౌలింగ్ చేసినా ప్రాబ్లం అనిపించలేదు. ఈరోజు మా సహజమైన ఆట ఆడాలని అనుకున్నాం.
కొంతమంది మాత్రమే అది చెయ్యగలిగారు' అని హర్మన్ప్రీత్ పేర్కొంది. కొన్ని సులభమైన క్యాచులు వదిలేయడం గురించి మాట్లాడుతూ.. మ్యాచులు గెలవాలంటే అలాంటి అవకాశాలను చేజార్చకూడదని, కానీ తాము ఆ పని చేయలేకపోయామని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications












