Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లైవ్‌లోనే రిపోర్టర్‌పై విరుచుకుపడ్డ హర్మన్‌ప్రీత్ కౌర్! (వీడియో)

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వార్తల్లో నిలిచారు. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల కెప్టెన్లందరితో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ , ఓ మహిళా రిపోర్టర్ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రిపోర్టర్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు భారత కెప్టెన్ ఘాటుగా సమాధానం ఇవ్వడమే ఇందుకు కారణం.

రిటైర్మెంట్ ప్రశ్నకు హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్
మీడియా సమావేశం సందర్భంగా ఓ రిపోర్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఉద్దేశించి.. "హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్.. "ఇది నా చివరి వరల్డ్ కప్ ఎందుకు అవుతుంది? నేనేమైనా రిటైర్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా?" అంటూ హర్మన్‌ప్రీత్ ఎదురుప్రశ్న వేశారు. దాంతో సదరు రిపోర్టర్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ.. "లేదు.. నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. ఇది మీ చివరి ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉంది" అని రిపోర్టర్ చెప్పారు. అయినప్పటికీ తగ్గని హర్మన్‌ప్రీత్ కౌర్.. "మరి అలాంటప్పుడు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?" అంటూ నిలదీశారు.

Harmanpreet Kaur Clashes With Reporter Over Retirement Question Ahead of Womens T20 World Cup 2026

జూన్ 14న పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. లండన్‌లో జరగబోయే ఈ మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. ఇక భారత జట్టు జూన్ 14న తన సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడటం ద్వారా ఈ టోర్నీలో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టీమిండియా ఉన్న గ్రూపులో పాకిస్తాన్‌తో పాటు నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, బలమైన ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

వరల్డ్ కప్‌లో టీమిండియా ట్రాక్ రికార్డ్
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆస్ట్రేలియా నిలవగా.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు కూడా ట్రోఫీలను గెలుచుకున్నాయి. టీమిండియా ఇప్పటివరకు 2020లో కేవలం ఒకే ఒక్కసారి ఫైనల్‌కు చేరుకుంది, అయితే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఇది కాకుండా భారత జట్టు నాలుగు సార్లు సెమీఫైనల్స్ వరకు వెళ్లగా.. మరో నాలుగు సార్లు గ్రూప్ దశ (మొదటి రౌండ్) నుంచే నిష్క్రమించింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ కరవు తీర్చాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలతో ఉంది.

Story first published: Monday, June 8, 2026, 11:12 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+