మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడా? గ్రౌండ్లో దిగడం ఇక అనుమానమేనా? ప్రస్తుతం ఇవే అనుమానాలు ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వ్యక్తమౌతున్నాయి. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో హార్దిక్ పాండ్య గ్రౌండ్ను వీడాడు. ఫిజియోథెరఫిస్ట్ సహకారంతో డ్రెస్సింగ్ రూమ్ దారి పట్టాడు.
ఎడమ గజ్జలో నొప్పి కారణంగా- హార్దిక్ పాండ్య గ్రౌండ్ను వీడినట్లు తెలుస్తోంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్య ఏడు ఓవర్లను వేశాడు. 34 పరుగులు ఇచ్చాడు. వికెట్ను పడగొట్టలేకపోయాడు.ఏడో ఓవర్ పూర్తయిన వెంటనే- అతను పెవిలియన్ దారి పట్టాడు. నడుస్తున్న సమయంలో కొద్దిగా కుంటడం కనిపించింది. ఎడమ గజ్జలో నొప్పి వల్లే పాండ్య అర్ధాంతరంగా వెళ్లిపోయాడని అంటున్నారు.
విరాట్ స్టన్నింగ్ క్యాచ్..ట్విట్టరెట్టీస్ ఫుల్ ఖుష్!
నొప్పి తగ్గకపోతే- బ్యాటింగ్కు రావడం కూడా అనుమానమేనని తెలుస్తోంది. హార్దిక్ పాండ్య లేకపోవడం వల్ల అతని స్థానంలో రవీంద్ర జడేజాను ఏకధాటిగా బౌలింగ్ చేయిస్తున్నాడు కేప్టెన్ కోహ్లీ. హార్దిక్ పాండ్య ఇంకా మూడు ఓవర్లు వేయాల్సి ఉంది. ఈ మూడు ఓవర్లను విరాట్ కోహ్లీ వేసే అవకాశాలు లేకపోలేదు.