
మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన హార్దిక్ పాండ్యా ఓ అరుదైన ఘనతను సాధించాడు. బ్యాటింగ్లో యాభై ప్లస్ పరుగులు, బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసిన అయిదో భారత ప్లేయర్గా రికార్డులకెక్కాడు. హార్దిక్ పాండ్యా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, కె.శ్రీకాంత్ తర్వాత హార్దిక్ ఈ ఘనత సాధించాడు. ఇకపోతే ఉపఖండం వెలుపల విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడిగా హార్దిక్ నిలిచాడు.
2011 ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ సాధించగా.. దాదాపు దశాబ్దం తర్వాత ఈ ఫీట్ అందుకున్న తొలి ప్లేయర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ బౌలింగ్లోనూ 4/24తో చెలరేగడంతో తొలుత ఇంగ్లాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఛేజింగ్లో హార్దిక్ 71పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇకపోతే 7వ సారి ఈ ఫీట్ హార్దిక్ సాధించగా.. అంతకుముందు ఈ ఫీట్ అందుకున్న లిస్టును ఓసారి పరిశీలిస్తే..
ఇండియా తరఫున వన్డేల్లో 50+ పరుగులు, 4+ వికెట్లు
భారత్ తరఫున వన్డేలో 50+ పరుగులు & 4+ వికెట్లు
1988లో న్యూజిలాండ్పై కె.శ్రీకాంత్ 70 & 5/27, వైజాగ్
1998లో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ 141 & 4/38 , ఢాకా,
1999లో శ్రీలంకపై సౌరవ్ గంగూలీ 130* & 4/21 v నాగ్పూర్,
2000లో జింబాబ్వేపై సౌరవ్ గంగూలీ 71* & 5/34 కాన్పూర్,
2008లో ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ 118 & 4/28 v ఇండోర్,
2011లో ఐర్లాండ్పై యువరాజ్ సింగ్ 50* & 5/31 v బెంగళూరు
2022లో ఇంగ్లాండ్పై హార్దిక్ పాండ్యా 50* & 4/24 v మాంచెస్టర్