అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను తప్పించేయండి
IPL 2026లో ముంబై ఇండియన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో నాలుగో విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లేకుండా ఆడిన ఈ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్సీలో ముంబై విజయం సాధించింది. అయితే హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఆడలేదని జట్టు చెబుతున్నా అతనిపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఆ పుకార్లే నిజమైతే ముంబై జట్టు హార్దిక్ను వదులుకోవడమే మంచిదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.
హార్దిక్ పాండ్యాకు జట్టులోని ఇతర ఆటగాళ్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లను సెహ్వాగ్ పూర్తిగా నమ్మకపోయినా ఒకవేళ అవి నిజమైతే మాత్రం హార్దిక్ను ముంబై ఇండియన్స్ వదులుకోవడమే మంచిదని సూచించారు. ఆ వార్తలు కేవలం పుకార్లే అయితే మాత్రం హార్దిక్ విలువైన ఆటగాడు కాబట్టి జట్టులోనే ఉంచుకోవాలని, వ్యక్తిగతంగా తాను హార్దిక్ వైపే మొగ్గు చూపుతానని సెహ్వాగ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఐపీఎల్లో ₹27 కోట్లతో రిషబ్ పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా పంత్ అంత విలువైన ఆటగాడేనని, అతనికి ఇప్పుడు ఇస్తున్న ₹16 కోట్ల జీతం చాలా తక్కువని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఎన్ని పుకార్లు వినిపించినా వాటన్నింటినీ చక్కదిద్దుకుని జట్టుగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ ఐపీఎల్ సీజన్ ముగియడానికి ముంబై ఇండియన్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ చివరి మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా మళ్ళీ బరిలోకి దిగుతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications