
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్ B మ్యాచ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించాడు. బౌలింగ్ లో అతను మూడు వికెట్లు పడగొట్టగా.. జట్టు కష్టాల్లో ఉండగా.. కోహ్లీకి సహకరించి 40 పరుగులు చేశాడు. గాయం తర్వాత విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు. ముఖ్యంగా 2022లో పాండ్యా ఫామ్ లో ఉన్నాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చివరి వరకు ఉండి జట్టును గెలిస్తారు. హార్దిక్ తనకు ఆటపై స్పష్టమైన అవగాహన ఉందని పదే పదే మ్యాచ్ ల్లో చూపించాడు. పాండ్యా మహిళా క్రికెట్ గురించి మాట్లాడారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన మహిళా వన్డేలో ఇంగ్లాండ్కు చెందిన చార్లీ డీన్ను భారత క్రీడాకారిణి దీప్తి శర్మ రనౌట్ చేయడంతో ఈ ఔట్ విధానం క్రికెట్ ప్రపంచ రెండుగా విడిపోయింది.
"నాన్స్ట్రైకర్ని ఔట్ చేయడం గురించి మనం గొడవ చేయడం మానేయాలి. ఇది వ్యక్తిగతం, ఎవరైనా నన్ను రనౌట్ చేసినా సరే." అని 'ICC రివ్యూ' తాజా ఎపిసోడ్లో హార్దిక్ అన్నారు. "నేను ఎక్కడ బ్యాటింగ్ చేస్తాను. టాప్ 3 లేదా 4లో బ్యాటింగ్ చేసే వ్యక్తులకు మ్యాచ్ లో ఆచితూచి ఆడాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిస్థితి బట్టి ఆడాలి. ధాటిగా ఆడాలని కొందరు కోరుకుంటారు. అది నా జట్టుకు హాని కలిగిస్తుంది కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోను" అని హార్దిక్ అన్నాడు.
"నేను పునరాగమనం చేసినప్పటి నుంచి, ఆశయం నాలో అత్యుత్తమ ఆటను బయటకు తీసింది. నేను ఏదైనా సాధించాలంటే, అది ఎక్సలెన్స్ అని నేను భావిస్తున్నాను, ప్రదర్శన కాదు, నా కెరీర్ కూడా. పాకిస్థాన్ జరిగిన మ్యాచ్ లో కోహ్లీతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడంపైనే దృష్టి సారించాం. మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గొప్పగా ఆడాడని హార్దిక్ పాండ్యా చెప్పాడు.