

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ గురువారం తన ట్విట్టర్లో పేర్కొంది.
హార్ధిక్ పాండ్యాతో వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ సిబ్బంది సూచించడంతో జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తన విశ్రాంతి సమయంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో హార్ధిక్ పాండ్యా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు.
వచ్చే వారం నుంచి పాండ్యా శిక్షణ ప్రారంభం కానుంది. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో పాటు వన్డే సిరిస్కు కూడా పాండ్యా దూరం కానున్నాడు. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.