హైదరాబాద్: నవంబర్ 16 నుంచి శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను శనివారం ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు మాత్రమే సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. ఈ రెండు టెస్టులకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పించారు.
జట్టు మేనేజ్మెంట్ను సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. శ్రీలంకతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీసేన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లో సుదీర్ఘంగా పర్యటించనుంది.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై పని ఒత్తిడి తగ్గించేందుకు... గాయాల బారిన పడకుండా విశ్రాంతి కల్పించినట్లు సెలక్టర్లు తెలిపారు. ఈ సమయంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్యా తన నైపుణ్యాలను మరింత మెరుగు పెట్టుకుంటాడని తెలిపారు.
ఇదిలా ఉంటే శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు గాను సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చారు. మూడు టెస్టుల సిరిస్లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో ప్రారంభం కానుంది.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.