టీమిండియాలోని దాదాపు అందరు ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం జట్టు టీ20 కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా కూడా ధోనీకి మంచి స్నేహితుడే. పాండ్యాకు అంతర్జాతీయంగా కెరీర్ వచ్చింది ధోనీ హయాంలోనే. అంతేకాదు, తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో మొదటి ఓవర్లో పాండ్యా అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. కానీ ధోనీ అతనిపై నమ్మకం ఉంచాడు. అదే తన జీవితాన్ని మార్చిందని పాండ్యా పలుమార్లు చెప్పాడు.
ఇప్పుడు కివీస్తో తొలి టీ20 ఆడేందుకు రాంచీ చేరుకుంది టీమిండియా. ధోనీ సొంత ఊరు కూడా రాంచీనే. అందుకే అక్కడకు వెళ్లగానే పాండ్యా వెళ్లి ధోనీని కలిశాడు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత బాలీవుడ్ మూవీ 'షోలే'లో ఉండే ఐకానిక్ సీన్ను వీళ్లిద్దరూ కలిసి రీక్రియేట్ చేశారు. బైక్పై పాండ్యా కూర్చొని ఉండగా.. దాని పక్కనే ఉన్న అటాచ్మెంట్లో ధోనీ కూర్చున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న హార్దిక్ పాండ్యా.. 'షోలే 2 త్వరలోనే వస్తుంది' అని క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తాము కూడా దీని కోసమే ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, కివీస్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే జోరులో టీ20 సిరీస్ కూడా నెగ్గాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే వన్డే సిరీస్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది. ఈ సిరీస్లో టీమిండియాకు పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. న్యూజిల్యాండ్ జట్టుకు వెటరన్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీ చేయనున్నాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందే భారత జట్టులో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. మణికట్టు గాయంతో సిరీస్కు దూరమవడం గమనార్హం.