హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ల కాఫీ వివాదానికి బీసీసీఐ ముగింపు పలకాలని భావిస్తోంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇప్పటికే బీసీసీఐ అంబుడ్స్మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ నేతృత్వంలోని కమిటీ టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9(మంగళవారం)న హార్ధిక్ పాండ్యా కమిటీ ముందు హాజరుకానున్నాడు. ఆ తర్వాత రోజైన బుధవారం రాహుల్ కూడా జైన్కు వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఇప్పటికే వారిద్దరూ క్షమాపణలు తెలిపారని, కొన్ని రోజులు క్రికెట్ ఆడకుండా నిషేధానికి గురైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దీంతో ఈ కాఫీ వివాదానికి ముగింపు పలికాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్, వరల్డ్కప్ దృష్ట్యా ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.
'కాఫీ' వివాదంపై జస్టిస్ జైన్ మాట్లాడుతూ "హార్దిక్.. రాహుల్లకు వారం క్రితమే నోటీసులు జారీ చేశాం. విచారణకు వారు కూడా ఉండాలని ఆదేశించాం. సహజ న్యాయం ప్రకారం. వారి వాదనను వినాల్సి ఉంది. విచారణకు హాజరై వారి వాదనను వినిపించాల్సిన బాధ్యత వారిదే. ఎప్పుడు వస్తారో చూడాలి" అని తెలిపారు.
అయితే ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్మన్గా డీకే జైన్ని నియమించింది. తాజాగా జైన్ సారథ్యంలోని కమిటీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్లో ఆడుతున్న కేఎల్ రాహుల్.. ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న హార్దిక్ పాండ్యాలకు అంబుడ్స్మన్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.