న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ కంటే కోహ్లీనే గొప్ప: పాండ్యా, రాహుల్‌ను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు

Hardik Pandya and KL Rahul Say Kohli Better Than Tendulkar, Get Brutally Roasted on Twitter

హైదరాబాద్: భారత‌లో క్రికెటర్లను ఒకరితో మరికొరిని పోల్చి చూడటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోన్న ప్రక్రియ. రికార్డులు లేదా సెంచరీలు నమోదు చేసినప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ఎన్నోసార్లు పోల్చిన సంగతి తెలిసిందే.

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానాఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు బీసీసీఐ నజరానా

అయితే, వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమ క్రికెటర్? అన్న ప్రశ్నకు మాత్రం అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల్లో ఎప్పటి నుంచో డిబేట్ జరుగుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కోహ్లీని పోల్చిన క్రమంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌‌లు చెప్పిన సమాధానం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమానికి

తాజాగా బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమానికి పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ వారి యొక్క క్రష్, లైప్ స్టైల్, పార్టీలు, బాలీవుడ్‌కు సంబంధించిన అనేక విషయాలను కరణ్‌ జోహార్‌తో పంచుకున్నారు. తన షోకు వచ్చిన గెస్ట్‌లను కరణ్ జోహార్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో వివాదాస్పద ప్రశ్నలను అడుగుతాడనే సంగతి తెలిసిందే.

ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో

అందరి లాగే వీరిద్దరిని కూడా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో కోహ్లీ, సచిన్‌లలో బెటర్ బ్యాట్స్‌మన్ ఎవరు? అన్న ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు గాను వీరిద్దరూ తడుముకోకుండా విరాట్ కోహ్లీ అని చెప్పారు. వీరి సమాధానంపై సోషల్ మీడియాలో సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ కోహ్లీకి భజన చేస్తోన్న కారణంగానే ఇంకా వీరి జట్టులో చోటు దక్కించుకుంటున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

టెస్ట్ సిరిస్‌లో కేఎల్ రాహుల్ విఫలం

ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓపెనర్‌గా మొదటి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్ స్ధానంలో కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు

అయితే, తన భార్య పండంటి పాపకు జన్మనిచ్చిన కారణంగా రోహిత్ శర్మ సిడ్నీ టెస్టుకు దూరం కావడంతో మళ్లీ తిరిగి నాలుగు టెస్టుకు ప్రకటించిన తుది జట్టులో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. చివరి టెస్టులో కూడా కేఎల్ రాహుల్ విఫలం కావడంతో అతడిపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో వన్డే సిరిస్‌లో రాహుల్‌కు చోటు దక్కదని అంతా భావించారు. అయితే, కేఎల్ రాహుల్ ఎన్నిసార్లు విఫలమైన కోహ్లీకి సన్నిహితంగా మెలగడంతోనే అతడికి సెలక్టర్లు మరిన్ని అవకాశాలను ఇస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

Story first published: Tuesday, January 8, 2019, 19:01 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X