
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబై ఇండియన్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమయ్యాయి. పవన్ నేగి వేసిన 19వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా (0, 6, 4, 4, 6, వైడ్, 1)తో మొత్తం 22 పరుగులు రాబట్టుకున్నాడు.

ఆరు మిగిలుండగానే ముంబై విజయం
దీంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే ముంబైకి విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టకాలం అనేది ఉంటుంది. అలానే నా జీవితంలో కూడా చోటు చేసుకుంది. ఇదే నా ప్రదర్శన మెరుగు పడటానికి కారణమైంది. నేను ధృఢంగా మారడానికి అవకాశం కల్పించింది" అని చెప్పాడు.
తనపై విధించిన సస్పెన్షన్పై కూడా పాండ్యా స్పందించాడు. "ఆ సమయం నాకు చాలా క్లిష్టమైనది. కానీ నా మైండ్ సెట్ను మొత్తం మార్చేసింది. నా ఫిట్నెస్ లెవెల్తో పాటు ఆటపై మరింత దృష్టి పెట్టడానికి కారణమైంది. మానసికంగా మరింత బలోపేతం కావడానికి నాపై విధించిన సస్పెన్షనే ప్రధాన కారణం" అని హార్ధిక్ పాండ్యా తెలిపాడు.

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వన్డే వరల్డ్కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్కప్ కోసం ప్రకటించిన జట్టులో హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పాండ్యా మాట్లాడుతూ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని తెలిపాడు.

టీమిండియాకు అనుకూలం
ఈ పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా మారుతాయిని పాండ్యా తెలిపాడు. "ఇంగ్లాండ్లో పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాం. ఈసారి మాత్రం అవి టీమిండియాకు హెల్ప్ అవుతాయి. ఆట అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అది ఐపీఎల్ అయినా లేక వరల్డ్కప్ అయినా" అని పాండ్యా అన్నాడు.


Click it and Unblock the Notifications












