Harbhajan Singh: బుధవారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ జట్టు చిత్తగా ఓడించింది. 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీపై విజయం సాధించింది. గుజరాత్ తరఫున స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో, జోస్ బట్లర్ 73 పరుగులతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు తేలికగా గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన మాజీ జట్టుపై సిరాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడని అన్నాడు. ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణం ఆ బౌలరేనని.. ఎందుకంటే సిరాజ్ తన స్పెల్లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా ఆర్సీబీని ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడని తెలిపాడు. అంతే కాకుండా ఆర్సీబీ కీలక బ్యాటర్లు ఫిల్ సాల్ట్(14), దేవ్దత్ పడిక్కల్(4), లివింగ్స్టోన్ (54)లను సిరాజ్ ఔట్ చేశాడు.

మ్యాచ్ తర్వాత, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన మాజీ జట్టుపై సిరాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడని మాట్లాడాడు. ఆర్సిబి ఓటమికి ప్రధాన కారణం ఆ బౌలర్, ఎందుకంటే అతను తన స్పెల్లో ఎక్కువ పరుగులు ఇవ్వలేదు, ఆటను గట్టిగా ఉంచాడు. అంతేకాకుండా, జట్టుకు గట్టి షాట్లు ఇచ్చిన ఫిల్ సాల్ట్ (13 బంతుల్లో 14), దేవ్దత్ పడిక్కల్ (3 బంతుల్లో 4), మరియు లియామ్ లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54) లను అతను అవుట్ చేశాడు.
హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. "ఐపీఎల్ 2025 సీజన్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నందున ఉత్సాహంగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఆడినా కూడా ఆర్సీబీ సిరాజ్ ను ఎంచుకోలేదు. ఇప్పుడు అదే సిరాజ్ ఆర్సీబీ ఓడను ముంచేశాడు. డీఎస్పీ సిరాజ్కు సెల్యూట్. ఇది కచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన. సిరాజ్కు అభినందనలు. గుజరాత్ టైటాన్స్ తరఫున జోస్ బట్ల అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. రషీద్ ఖాన్ అంతగా ఏమి రాణించలేదు." అని హర్భజన సింగ్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నారు.
గుజరాత్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి కేవలం 169 పరుగులకే పరిమితమైంది. ఈ క్రెడిట్ అంతా గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు చెందుతుంది. సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ తప్ప మిగతా బౌలర్లందరూ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. రషీద్ ఖాన్ మరోసారి వికెట్ లేకుండానే ఉన్నాడు. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించింది. రెండు విలువైన పాయింట్లతో మంచి నెట్ రన్ రేట్ సాధించింది. టోర్నమెంట్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన తర్వాత ఆర్సీబీ విజయ పరంపరను గుజరాత్ టైటాన్స్ ఆపేసింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(PBKS), ఢిల్లీ క్యాపిటల్స్(DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.