
హైదరాబాద్: హర్బజన్ సింగ్కు అసలు కోపమే ఉండదంటారు కొందరు. అలాగే అతను నిగర్వి అని కూడా కితాబిస్తుంటారు. క్రికెట్ మైదానం విడిచిపెడితే సాధారణ వ్యక్తిలా ప్రవర్తించే హర్బజన్ సింగ్ తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఆడి దాదాపు 400వికెట్ల వరకు తీసిన హర్జజన్ సింగ్ తన గ్రౌండ్స్ మన్ అయిన ములాయం సింగ్తో కలిసి డిన్నర్ని పంచుకున్నాడు. తన ఇంటి దగ్గర్లో ఉన్న మైదానాన్ని పర్యవేక్షించేందుకు గాను ఒక వ్యక్తిని నియమించారు. అతనే ములాయం సింగ్.
ఇది హర్జజన్ సింగ్లోని సాధారణ వ్యక్తిత్వానికి నిదర్శనం. అయినా క్రికెట్ మైదానంలోనూ హర్జజన్ నవ్వుతూనే కనిపిస్తాడు. ఇటీవలే న్యూ ఢిల్లీలో జరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లిలో కూడా తను సంప్రదాయ నృత్యమైన బాంగ్రా చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.