
రాయుడిపై కేకలు వేసిన హర్భజన్ సింగ్
దీంతో కోపోద్రిక్తుడైన హర్భజన్ సింగ్ వెంటనే రాయుడిపై గట్టిగా కేకలు వేశాడు. రాయుడు సైతం అదే రీతిలో స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత వెంటనే హర్భజన్ సింగ్ వెంటనే రాయుడి భుజంపై చేతులు వేసి సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ రాయుడు చేతులు విదిల్చుకొని భజ్జీకి దూరంగా వెళ్లిపోయాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడే సందర్భంలో హర్భజన్ సింగ్ 'భజ్జీ బ్లాస్ట్' అనే ఛాట్ షోలో అంబటి రాయుడిని ఇంటర్యూ చేశాడు. ఈ ఇంటర్యూలో ఆ మ్యాచ్కి సంబంధించి అప్పటి సంగతులు వీరిద్దరూ గుర్తు చేసుకున్నారు. ఇంటర్యూలో వీరిద్దరి సంభాషణలు ఈ విధంగా ఉన్నాయి.
నేనెంతో మందితో పోట్లాడాను
హర్భజన్ సింగ్: నేనెంతో మందితో పోట్లాడాను. అందులో ఒక్కరు మాత్రమే నాకు ఎదురుతిరిగారు. అతడే రాయుడు. మైదానంలో ఇలాంటివి సహజం. అంత వరకు ఫర్వాలేదు. మైదానం బయట మాత్రం అలా ఉండకూడదు. మైదానంలో కాకపోతే ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ. జట్టు అత్యత్తుమ ఫలితం కోసమే కదా ఇదంతా.
అంబటి రాయుడు: అప్పుడు జరిగిన దానికి నేను మళ్లీ క్షమాపణలు తెలియజేస్తున్నా. నేనెన్నో సార్లు క్షమించాలని కోరా.
హర్భజన్ సింగ్: వద్దు.. వద్దు.. క్షమాపణలు వద్దు. నువ్వొక్కడివే కాదు నేనూ చాలా సార్లు సీనియర్లతో గొడవ పడ్డా. ఆ తర్వాత వెళ్లి క్షమాపణలు కోరడంతో సమస్య అక్కడితో పోయేది.
అంబటి రాయుడు: అప్పుడెందుకు అలా ప్రవర్తించానో నాకే తెలియదు.

8 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్(117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో మూడో ట్రోఫీని అందుకున్న రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘతన సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు (2013, 2015, 2017)లో మూడు సార్లు ట్రోఫీని అందుకుంది.

రోహిత్ శర్మ సరసన రాయుడు, భజ్జీ
తద్వారా అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. 2009లో రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ నాలుగు సార్లు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు. అయితే, ఆదివారం జరిగిన పైనల్లో సన్రైజర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించడంతో ఇప్పుడు అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ కూడా రోహిత్ శర్మ సరసన నిలిచారు. రోహిత్ శర్మతో పాటు అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల(నాలుగు సార్లు) జాబితాలో ఈ ఇద్దరు కూడా చేరారు.


Click it and Unblock the Notifications
