|
బంగ్లా పర్యటన నుంచి కోహ్లీకి విశ్రాంతి
గతేడాది కూడా కోహ్లీ తన పుట్టినరోజు నాడు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పట్లో వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. వెస్టిండిస్తో టీ20 సిరిస్ జరగుతున్న సమయంలోనే కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో గతేడాది విరాట్ కోహ్లీ తన పుట్టినరోజుని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్లో జరుపుకున్నాడు.
సూపర్ ‘వి' పేరిట కొత్త సిరిస్
ఇదిలా ఉంటే, కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని స్టార్స్పోర్ట్స్ సూపర్ ‘వి' పేరిట రూపొందించిన సిరీస్లో తొలి ఎపిసోడ్ను మంగళవారం (మధ్యాహ్నం 3.30) ప్రసారం చేస్తోంది. 15 ఏళ్ల వయస్సులో క్రికెట్లోకి అడుగు పెట్టినప్పటినుంచి భారత జట్టుకు కెప్టెన్ అయ్యే వరకు కోహ్లీ ఎదుర్కొన్న కష్టాలతో పాటు సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్లో ప్రదర్శించనున్నారు.
|
యువతకు స్ఫూర్తినిచ్చేలా
దీంతో పాటు చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్ కోహ్లీకి ఉన్న సంబంధాలను అద్భుతంగా చూపించనున్నారు. ఈ సూపర్ 'వి' సిరిస్ను దేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. తొలి ఎపిసోడ్ను కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం టెలికాస్ట్ చేయనున్నారు.
|
భూటాన్ పర్యటనలో విరుష్క జోడీ
మిగిలిన పదకొండు ఎపిసోడ్స్ను ఆ తర్వాతి ఆదివారాలు ఉదయం 9 గంటల నుంచి స్టార్ప్లస్, స్టార్ స్పోర్ట్స్, డిస్నీ, మార్వెల్ హెచ్క్యూ, హాట్ స్టార్లో ప్రసారం చేయనున్నారు. కాగా, కోహ్లీ పుట్టినరోజు పుట్టినరోజు నాడు భూటాన్ను పర్యటనకు ఎందుకు వెళ్లామనే విషయాన్ని సైతం అనుష్క శర్మ తన ఇనిస్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. స్వచ్ఛమైన మానవ సంబంధాలను మేం ఇష్టపడుతామని అనుష్క శర్మ వెల్లడించింది.
|
ట్విట్టర్లో కోహ్లీ భావోద్వేగ సందేశం
కోహ్లీ తన పుట్టినరోజు నాడు తన ట్విట్టర్లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు. చిన్నతనంలో తన గురించి తాను రాసుకున్న లేఖను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నాళ్ల తన జర్నీ, తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఆ లేఖలో రాశాడు. కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానని అందులో రాసుకొచ్చాడు.