హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఓ ఇంటివాడయ్యాడు. వరంగల్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్తో హన్మకొండలో హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాలులో హనుమ విహారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
హైదరాబాద్కు చెందిన పారిశ్రామిక వేత్త ఏరువ రాజేంద్ర రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రీతిరాజ్ను తొలిసారిగా కలుసుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయడంతో.... అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
మే 20వ తేదీన హైదరాబాద్లో వీరు రిసెస్షన్ ఏర్పాటు చేశారు. స్వీడన్లో మాస్టర్స్ చేసిన ప్రీతి ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దేశవాళీ రంజీ క్రికెట్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హనుమ విహారి గతేడాది సెప్టెంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు.
భారత జట్టు తరఫున 4 టెస్టులు ఆడిన విహారి 167 పరుగులు చేశాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 12వ సీజన్లో రెండు మ్యాచ్లాడి 4 పరుగులతో నిరాశపరిచాడు.