IPL 2025: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆర్సీబీ, సీఎస్కే, ముంబై ఇండియన్స్ జట్లు కూడా ఇప్పటివరకు చేయలేని ఘనతను సాధించింది.
ఒకే జట్టులో ముగ్గురు 500 పరుగులు దాటారు..
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి దూకుడుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో గుజరాత్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గుజరాత్ జట్టులోని టాప్-3 బ్యాటర్లు కూడా ప్రతి మ్యాచ్లోనూ పరుగులు సాధిస్తున్నారు. ముంబై గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక ఘనత సాధించింది. గుజరాత్కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఒకే ఐపీఎల్ సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ముగ్గురు ఆటగాళ్లు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎప్పుడూ చూడలేదు.

ఈ ముగ్గురు ఆటగాళ్లలో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఉన్నారు. సాయి సుదర్శన్ ఇప్పటివరకు 509 పరుగులు, శుభ్మన్ గిల్ 508 పరుగులు, జోస్ బట్లర్ 500 పరుగులు సాధించారు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు గుజరాత్ టైటాన్స్కు చెందిన వారే కావడం గమనార్హం.
ముంబైపై 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన గిల్
శుభ్మన్ గిల్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దీని కారణంగా శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. గిల్ కాకుండా జోస్ బట్లర్ 30 పరుగులు చేశాడు.