GT vs MI: ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులోని ఇద్దరు బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో ఆశిష్ నెహ్రా తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ సమయంలో మైదానం వెలుపల బౌండరీ లైన్పై అరుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. నిజానికి ఐపీఎల్ 18వ సీజన్లో మార్చి 29న నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక్క గుజరాత్ టైటాన్స్ జట్టు పట్టు సాధించడంలో విజయవంతమైంది. కానీ గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా మ్యాచ్ సమయంలో తన లోయర్ ఆర్డర్ బ్యాటర్ల ప్రదర్శన చూసి కోపంగా కనిపించాడు.
కోపంగా కనిపించిన ఆశిష్ నెహ్రా
మ్యాచ్ సమయంలో ఆశిష్ నెహ్రా ఓపిక కోల్పోయాడు. ఆ సమయంలో ఆశిష్ నెహ్రా మైదానం మధ్యలో అరుస్తూ కనిపించాడు. మ్యాచ్లో ఈ ఆశ్చర్యకరమైన క్షణం గుజరాత్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో కనిపించింది. ముంబై ఇండియన్స్ తరఫున దీపక్ చాహర్ బౌలింగ్ చేశాడు. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికే రాహుల్ తెవాటియా కాస్త నిదానంగా కనిపించాడు. అతను క్రీజులోకి తిరిగి రాకముందే హార్థిక్ పాండ్యా వేసిన అద్భుతమైన త్రోకు రాహుల్ తెవాటియా రనౌట్ అయ్యాడు. ఆ పెద్ద దెబ్బ నుంచి జట్టు ఇంకా కోలుకోకముందే.. ఆ తర్వాత బంతికే షెర్పేన్ రూథర్ఫోర్డ్ కూడా పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ బౌండరీ లైన్ వద్ద సాంట్నర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆశిష్ నెహ్రా తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. బిగ్గరగా అరుస్తూ కనిపించాడు.

మ్యాచ్ ఓడిన ముంబై
శనివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ కు మద్దతు ఇచ్చి 38 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా గుజరాత్ టైటాన్స్ 196/8 స్కోరు చేసి ముంబైకి 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. 18వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ విజయ ఖాతాను తెరిచింది.