హైదరాబాద్: ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. ఇప్పుడు టెస్టు సిరీస్కు సిద్ధమయ్యేందుకు కాస్తంత విరామంగా తీసకుంది. తోంది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కాస్తంత సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ సహచరులతో సరదాగా ఉండే బ్యాట్స్మన్ శిఖర్ ధావన్.. ఈసారి కెప్టెన్ కోహ్లీకి ఓ పెరుపెట్టాడు.
చిన్నపిల్లల నుంచి ఎందరో ఆసక్తిగా వీక్షించే టామ్ అండ్ జెర్రీ అంది. ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్ అయిన 'టామ్ అండ్ జెర్రీ' నుంచి విరాట్కు ఓ పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తనతో విరాట్ కలిసున్న ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఇందులో రెడ్ క్యాప్ ధరించి విరాట్ కోపంతో చూస్తున్నట్లు ఉంది. నల్ల కళ్లద్దాలు, దుస్తుల్లో ఉన్న ధావన్ మరోవైపు చూస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో కింద' టామ్ అండ్ జెర్రీ వాలా బద్మాష్ బిల్లా.. విరాట్ కోహ్లీ, నేను జగ్గా జాట్' అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు.
Tom nd jerry waala badmaash billa @virat.kohli 🤪🤣🤣🤣🤣🤣 aur main jagga jatt😜😜🤣🤣🤣🤣.
A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on
మూడు వన్డేల సిరిస్ ముగియడంతో అనంతరం లభించిన విరామంతో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో జాలీగా గడిపాడు. ఈ సందర్భంగా కారులో షికారు చేస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#Virtakohli and #AnushkaSharma hang around on the streets of England with #ShikharDhawan and his family! pic.twitter.com/QviPGqy8Q0
— MyKhel Telugu (@myKhelTelugu) July 21, 2018
దీంతో ఆసక్తి రేకెత్తిస్తుండటంతో.. ఈ ఫొటో వైరల్గా మారింది. ధావన్ ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య అయేషా ముఖర్జీ, ముగ్గురు పిల్లలతో కలిసి బంకింగ్హామ్ ప్యాలెస్ ముందు దిగిన ఫొటోలను అభిమానులను పంచుకున్నాడు. ఇంగ్లాండ్, భారత్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 1 నుంచి బర్మింగ్హామ్లో జరగనుంది.