హాఫ్ సెంచరీల ఊచకోత.. ఢిల్లీ బౌలర్లు బేజారు!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రత్యర్థి ముందు సవాల్ విసిరే స్కోరును ఉంచింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే 210 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటర్లలో ముగ్గురు బ్యాటర్లు శుభ్ మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలు బాదడంతో భారీ స్కోరు సాధించగలిగింది. అయితే, ఇన్నింగ్స్ చివర్లో బ్యాటర్లు కాస్త నెమ్మదించడం ఆ జట్టును 220-225 పరుగుల మార్కుకు చేరకుండా అడ్డుకుంది.
బట్లర్ విధ్వంసం.. గిల్, సుందర్ జోరు
ఇన్నింగ్స్ ఆరంభంలోనే సాయి సుదర్శన్ (ముఖేష్ కుమార్ బౌలింగ్లో) క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో వరుస బౌండరీలతో విరుచుకుపడిన బట్లర్, కేవలం 24 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న బట్లర్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఢిల్లీకి ఊరటనిచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా, చెరో అర్ధశతకంతో రాణించారు. గిల్, సుందర్ జోరు చూస్తుంటే గుజరాత్ స్కోరు 220 దాటుతుందని అందరూ భావించారు.

డెత్ ఓవర్లలో నెమ్మదించిన బ్యాటింగ్
18వ ఓవర్లో శుభ్మన్ గిల్ ఔట్ కావడంతో గుజరాత్ ఇన్నింగ్స్ తడబడింది. ఇన్నింగ్స్ చివర్లో అత్యంత కీలకమైన చివరి 12 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం గమనార్హం. వరుసగా 12 డెత్ బాల్స్ పాటు బౌండరీ లేకుండా ఆడటం గుజరాత్ టైటాన్స్కు ఆ అదనపు 15-20 పరుగులను దూరం చేసింది. ఈ చిన్నపాటి విరామం మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. లుంగి ఎంగిడి, కుల్దీవ్ తలో వికెట్ తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉండటంతో, వారు ఈ లక్ష్యాన్ని ఛేదించగలమని ధీమాగా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications