For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఆ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకండి.. మాజీ కోచ్ వార్నింగ్

IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే దానిపై ఎక్కువగా దృష్టి సారించడం అనవసరమని ఆసీస్ మాజీ ప్లేయర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నారు. ఒకే ఆటగాడిపై జట్టు యాజమాన్యం అతిగా ఆధారపడటం సరైన విధానం కాదని కూడా ఆయన హెచ్చరించారు.

ఒక జట్టు విజయం కేవలం ఒక వ్యక్తిగత ఆటగాడి ప్రతిభతో మాత్రమే రాదని.. అది జట్టు ప్రయత్నమని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో " జస్‌ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడా లేదా అనే దాని గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కానీ ఇటీవల జస్‌ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ అనేక టెస్ట్ మ్యాచ్‪లలో గెలిచిందని మనం గమనించాలి. ఇక్కడ వ్యక్తిగత ప్రతిభ కంటే జట్టు అంతా కలిసి చేసే ప్రయత్నమే ముఖ్యం. ప్రతి ఆటగాడు తమ పనిని సరిగ్గా చేసినప్పుడే జట్టు విజయం సాధిస్తుంది. కెప్టెన్ ప్రతి ఆటగాడికి వారి పాత్ర ఏమిటో స్పష్టంగా తెలిపి.. వారికి ఆత్మవిశ్వాసాన్ని, ప్రణాళిక పట్ల అంకితభావాన్ని కల్పించాలి. అదే విజయానికి రహస్యం." అని గ్రెగ్ చాపెల్ అన్నారు.

Greg Chappell Warns Team India Don t Over-Rely on Bumrah Cricket is a Team Game

శుభ్‌మన్ గిల్ గ్రెగ్ చాపెల్ సలహా
భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక గొప్ప టెస్ట్ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయాలనుకుంటే.. తన కెప్టెన్సీని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయమని మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ సలహా ఇచ్చారు. దీని గురించి గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ.."శుభ్‌మన్ గిల్ ఒక గొప్ప టెస్ట్ కెప్టెన్‌గా ఎదగాలనుకుంటే.. తన అధికారాన్ని స్థాపించడానికి ఇదే సమయం. బ్యాటింగ్‌లో మాత్రమే కాదు, తన కెప్టెన్సీలో కూడా అతను ముద్ర వేయాలి. జట్టుకు ప్రమాణాలను నిర్దేశించి ఆటగాళ్ల నుంచి వాటిని ఆశించాలి. సరైన జట్టును ఎంపిక చేసి ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలి. ప్రతి ఆటగాడి నుంచి ఏమి ఆశించబడుతుందో నిర్ధారించి వారి నుంచి దానిని పొందాలి. చివరగా, క్రికెట్ అనేది హీరోల గురించి కాదు, అది భాగస్వామ్యాలు, జట్లు, తమ చుట్టూ ఉన్నవారి నుంచి ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురాగల కెప్టెన్ల గురించినది" అని గ్రెగ్ చాపెల్ అన్నారు.

బుమ్రా పాత్రపై కొనసాగుతున్న చర్చ
ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బుమ్రా 3 మ్యాచ్‌లలో మాత్రమే ఆడతాడని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ముందుగానే స్పష్టం చేశారు. ఈ సిరీస్ ప్రారంభం కావడానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నారని, బుమ్రా పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక రూపొందించబడిందని గంభీర్ అన్నారు.ఈ నేపథ్యంలో మాజీ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ లాయిడ్.. బుమ్రా లేని మ్యాచ్‌లలో భారతదేశం సాధించిన గెలుపు, ఓటముల గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. బుమ్రా ఆడే మ్యాచ్‌ల కంటే, అతను లేని మ్యాచ్‌లలోనే భారత్ ఎక్కువ విజయాలు సాధించిందనే గణాంకాలు చర్చలకు దారితీశాయి.

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జులై 23న ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, భారత జట్టు సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యవసరం. కాబట్టి బుమ్రా పాత్రపై చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకుంటూనే ఉన్నాయి.

Story first published: Sunday, July 20, 2025, 12:37 [IST]
Other articles published on Jul 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+