Rinku Singh: ఆదివారం భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గల సెంట్రల్ హోటల్లో జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్గోపాల్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, తదితర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందరూ రింకూ, ప్రియా జంటను అభినందించారు. వారు అతిథులను పలకరించి వారితో ఫోటోలు దిగారు.
రింకూ సింగ్, ప్రియా సరోజ్ సాంప్రదాయ దుస్తులలో కెమెరాకు పోజులిచ్చారు. రింకూ సింగ్ తన కుటుంబంతో కలిసి బులంద్షహర్లోని చౌదేరా వాలి విచిత్ర దేవి మందిర్లో ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రింకూ సింగ్, ప్రియా సరోజ్ తెలుపు, గులాబీ రంగు దుస్తులలో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమం పుల్కర్న్ హాల్లో జరిగింది. హాల్ను పువ్వులు, రంగురంగుల లైట్లతో అలంకరించారు. హాల్ 300 మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది.

క్రికెట్, రాజకీయాలకు చెందిన చాలా మంది ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులకు వివిధ రకాల శాఖాహార వంటకాలు వడ్డించారు. ఈ ఆహారంలో అవధి వంటకాలు, రసగుల్లా, జీడిపప్పు-పనీర్ రోల్ వంటి బెంగాలీ స్వీట్లు, యూరోపియన్, ఆసియా వంటకాలు ఉన్నాయి. రింకూ ఇష్టమైన వంటకాలైన పనీర్ టిక్కా, మటర్ మలై కూడా మెనూలో ఉన్నాయి. దీనితో పాటు మలై కోఫ్తా, కధై పనీర్, వెజ్ మంచూరియన్, స్ప్రింగ్ రోల్ కూడా ఉన్నాయి.