
స్టేడియానికి వస్తే కనిపించకుండా ఉండమని చెప్తా
ఒక వేళ వారు వచ్చిన తనకు కనిపించకుండా ఉండమని చెప్తానని సచిన్ తెలిపారు. 2003-04లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ను చూడటానికి తన భార్య అంజలి వచ్చిందని, ఆ సమయంలో తాను మొదటి బంతికే అవుటయ్యానని తెలిపారు. దీంతో అంజలి వెంటనే స్టేడియం నుంచి వెళ్లి పోయిందని సచిన్ చెప్పుకొచ్చారు.

మైదానంలో ఏకాగ్రతతో ఉంటాను
`మైదానంలో బ్యాటింగ్కు వెళ్లినపుడు చాలా ఏకాగ్రతతో ఉంటాను. అయితే నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో నా కుటుంబ సభ్యులు ఉంటే ఆట మీద పూర్తిగా దృష్టి పెట్టలేను. అందుకే వారిని ఎప్పుడూ స్టేడియానికి రమ్మని ఆహ్వానించలేదు' అని సచిన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

తొలి బంతికే ఔటయ్యా
'2004లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ను చూసేందుకు అంజలి మైదానానికి వచ్చింది. ఆ మ్యాచ్లో నేను తొలి బంతికే ఔటయ్యా. ఆమె వెంటనే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె స్టేడియాలకు రావడం మానేసింది. మళ్లీ నా చివరి మ్యాచ్ చూడడానికే వచ్చింది' అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

ఆ క్షణంలో చాలా భావోద్వేగానికి గురయ్యా
అలానే వెస్టిండీస్తో జరిగిన తన చివరి మ్యాచ్కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ను చూడడానికి తొలిసారి తన అమ్మగారు స్టేడియానికి వచ్చారని సచిన్ తెలిపాడు. ఆ సమయంలో ధోని తనను హడిల్ నుంచి దూరంగా ఉండమని కోరాడని, తనకు వీడ్కోలు ఇవ్వడానికి వారు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం తనకు అర్థమైందన్నారు. ఆ క్షణంలో తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని సచిన్ వివరించాడు.


Click it and Unblock the Notifications
