హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుని ముందుండి ఫైనల్కి చేర్చిన గంభీర్ సోమవారం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. యువ క్రికెటర్లకి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు.
గంభీర్ స్థానంలో ఆ జట్టు యువ ఆటగాడు నితీశ్ రాణా ఢిల్లీ జట్టు పగ్గాలు అందుకునే అవకాశాలున్నాయి. విజయ్ హజారే ట్రోఫీ 2016-17 సీజన్లో గంభీర్ని కెప్టెన్సీ నుంచి తప్పించిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అప్పట్లో రిషబ్ పంత్కి బాధ్యతలు అప్పగించింది. అయితే, అతడు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు.
Time to pass the captaincy baton to youngsters, hence have requested the DDCA selectors not to consider me for that role. I will be in the background helping the new leader to win games @RajatSharmaLive
— Gautam Gambhir (@GautamGambhir) November 5, 2018
ఈ కారణం చేత 2017-18 సీజన్కి మళ్లీ గంభీర్ చేతికే సెలక్టర్లు జట్టు పగ్గాలు అప్పగించారు. తాజా సీజన్లో గంభీర్ ఓ సెంచరీతో పాటు మొత్తం 518 పరుగులు చేశాడు. అంతేకాదు టోర్నీలో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు.