
దశాబ్దకాలం పాటు ఓపెనర్గా అద్వితీయ
అనతికాలంలోనే టీమిండియాకి ఎంపికై దశాబ్దకాలం పాటు ఓపెనర్గా అద్వితీయ రికార్డుల్ని నమోదు చేశాడు. అయితే.. రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ఈ వెటరన్ క్రికెటర్.. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలు ఆడుతూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. కానీ.. మంగళవారం రాత్రి అనూహ్యంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

విజయంతో వీడ్కోలు పలకాలని ఢిల్లీ
రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకి ఆడుతున్న గౌతమ్ గంభీర్.. ఆంధ్రాతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మ్యాచ్ తన కెరీర్లో ఆఖరిదని రిటైర్మెంట్ సమయంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. గురువారం మ్యాచ్ ప్రారంభమవగా.. దిగ్గజ క్రికెటర్కి విజయంతో వీడ్కోలు పలకాలని ఢిల్లీ జట్టు ఆశిస్తోంది. మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆంధ్రా జట్టు 17 ఓవర్లలో 58/4తో తొలి సెషన్లో కొనసాగుతోంది.

వన్డేల్లోనూ నిలకడగా రాణించిన ఈ ఓపెనర్
2003లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన గౌతమ్ గంభీర్.. కెరీర్లో మొత్తం 58 టెస్టులాడి 4,154 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 22 అర్ధశతకాలు ఉండగా.. 147 వన్డేల్లో 5,238 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ నిలకడగా రాణించిన ఈ ఓపెనర్ 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక 37 టీ20ల్లోనూ 932 పరుగులు చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలోనూ గౌతమ్ గంభీర్ సభ్యుడిగా ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications












