For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెమెరా ముందే గిల్‌ ఇజ్జత్ తీసిన గంభీర్! (వీడియో)

ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన తర్వాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. మ్యాచ్ ఫలితం పట్ల కోచ్ తీవ్ర అసంతృప్తిగా కనిపించారు. గంభీర్ తన అసంతృప్తిని కెప్టెన్, బౌలింగ్ కోచ్‌తో పంచుకున్నారు.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా ముందు 26 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యం ఉంటారు. ఆతిథ్య జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 21.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Gautam Gambhir Scolds Captain Shubman Gill On-Camera After Perth ODI Loss

క్లాస్ తీసుకున్న హెడ్ కోచ్ గంభీర్
టీవీ కెమెరాలు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌‌తో కోపంగా తీవ్రంగా సంభాషిస్తున్న దృశ్యాలను బంధించాయి. గౌతమ్ గంభీర్ సరిగ్గా ఏమి మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలియకపోయినా అది ఏకపక్ష సంభాషణలా అనిపించింది. కెప్టెన్ గిల్ నిశ్శబ్దంగా మౌన ప్రేక్షకుడిలా ఉండిపోయారు. గిల్ తిరిగి సమాధానం చెప్పడం కనిపించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కెప్టెన్ గిల్‌కు తొలి అనుభవం
శుభ్‌మన్ గిల్‌కు టీమిండియాకు వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా ఇది తొలి మ్యాచ్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కాగా.. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించినట్టు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ప్రకటన సమయంలో తెలియజేశారు.

మ్యాచ్ సారాంశం
తొలి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు అనుకూల పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకున్నారు. 4 సార్లు వర్షం కారణంగా ఆట నిలిచిపోయినప్పటికీ.. భారత్ కేవలం 26 ఓవర్లలో 136 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గిల్ (10), రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0), శ్రేయాస్ అయ్యర్ (11) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (31), కేఎల్ రాహుల్ (38) మాత్రమే భారత స్కోరును కాపాడగలిగారు.

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ 52 బంతుల్లో 46 పరుగులతో అద్భుతంగా రాణించారు. జోష్ ఫిలిప్ 29 బంతుల్లో 37 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరపున అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.

Story first published: Monday, October 20, 2025, 10:34 [IST]
Other articles published on Oct 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+