
లంకేయులకు ఊరటనిచ్చే విజయం
కొన్నాళ్లుగా శ్రీలంక విపరీతమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే రాజకీయపరమైన సంక్షోభం కూడా తలెత్తింది. ఈ క్రమంలో ధరలు అమాంతం పెరగడం, అలాగే పెట్రోల్, కనీస అవసరాలు కూడా దొరకక ప్రజలు అల్లాడిపోయారు. ఈ దుర్భిక్ష సమయంలో శ్రీలంక దేశ ప్రజలకు ఊరటనిచ్చింది ఆ దేశ క్రికెట్ జట్టు. అనూహ్యంగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచి వాహ్వా అనిపించిన ఆ జట్టు.. తర్వాత టెస్టుల్లో కూడా సిరీస్ సమం చేసి భళా అనిపించింది. ఆ తర్వాత పాకిస్థాన్, ఇండియా లాంటి దునర్భేద్య టీంలు పాల్గొన్న ఆసియాకప్ టోర్నీలో సత్తా చాటుతూ ఎవరీ అంచనాలకు అందని విధంగా ఏకంగా ట్రోఫీ గెలుచుకుంది. ఈ విజయం సంక్షోభ శ్రీలంక ప్రజలకు గొప్ప ఊరటగా మిగలనుంది. అలాగే కొన్నేళ్లుగా డీలా పడ్డ శ్రీలంక క్రికెట్ మళ్లీ పునరుత్తేజం పొందడానికి ప్రేరణగా మారనుంది.
జరగాల్సింది శ్రీలంకలోనే కాకపోతే..
ఇకపోతే అసలు ఈ ఆసియాకప్ టోర్నీ శ్రీలంకలో జరగాల్సింది. ఇక రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిర్వహించడానికి వీలు పడలేదు. ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా తాము నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి తెలియజెప్పింది. ఇక ఏసీసీ పెద్దలు చర్చించి యూఏఈలో నిర్వహించడానికి నిర్ణయించారు. అలా లంకలో జరగాల్సిన టోర్నీ.. యూఏఈలో జరిగింది. కెప్టెన్ దసున్ షనక సైతం.. ఈ టోర్నీ మా దేశంలో జరగాల్సింది.. మా దేశ ప్రజలకు ఈ టోర్నీని అందించాలనుకున్నాం.. అది యూఏఈలో జరుగుతుంది అయినా గెలిచేందుకే వచ్చామని టోర్నీ ఆరంభ మ్యాచ్ల టైంలో చెప్పిన సంగతి తెలిసిందే.
బ్యాటింగ్లో రాజపక్స, బౌలింగ్లో హసరంగా, ప్రమోద్
ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్లో రాజపక్స్ (71నాటౌట్), బౌలింగ్లో పేసర్ ప్రమోద్ మదుషన్ (4 ఓవర్లలో 4/34), లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ (4 ఓవర్లలో 3/27) చెలరేగారు. దీంతో పాకిస్థాన్ 23పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ఒకానొక దశలో 2వికెట్ల నష్టానికి పాక్ 93పరుగులతో ఉంది. అయితే వీరిద్దరు అనూహ్యంగా చెలరేగడంతో పాకిస్థాన్ 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్కు 24వేల మంది ప్రేక్షకులు హాజరుకాగా.. అందులో 20,000 మందికి పైగా పాకిస్తాన్ అభిమానులే ఉన్నారు. ఈ శ్రీలంక అభిమానుల కేకలు ఆ 20,000మంది కన్నా హోరెత్తించేలా అరిచారు. లంక ఫ్యాన్స్కు ఉన్నట్టి గెలుపు పిపాస ఎంతటిదో ప్రేక్షక గుణం చూపించింది.


Click it and Unblock the Notifications












