For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్ ఓటమి నుంచి బయటపడాలంటే చేయాల్సిందిదే'

India should be looking to save the Test

ముంబై: రెండో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్ పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తుండటంతో.. గెలుపు అవకాశాలు ముగిసిపోయినట్లే. అయితే, లార్డ్స్ టెస్టు ఓటమి నుంచి భారత్ ఇప్పుడు తప్పించుకోవాలంటే సహనంతో బ్యాటింగ్ చేయాలని వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఇంగ్లాండ్ జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లోనే 289 పరుగుల భారీ ఆధిక్యం లభించిన నేపథ్యంలో.. మిగిలి ఉన్న ఒకటిన్నర రోజు (ఐదు సెషన్లు) మాత్రమే మిగిలి ఉంది.

భారత్ జట్టు 289 పరుగుల ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో తొలుత సమం చేసి.. ఆ తర్వాత ఆ జట్టుకి టార్గెట్‌ని నిర్దేశించడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు మ్యాచ్‌ను కాపాడుకునేందుకు భారత్ ముందున్న ఏకైక దారి.. ఐదు సెషన్లలోనూ బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ని డ్రాగా ముగించడం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 107 పరుగుల‌కి ఆలౌటవగా.. ఇంగ్లాండ్ 396/7తో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

'ఇంగ్లాండ్ జట్టుకి భారీ ఆధిక్యం లభించిన నేపథ్యంలో.. మ్యాచ్‌ను కాపాడుకునేందుకు భారత బ్యాట్స్‌మెన్లు ఇక మిగిలిన ఐదు సెషన్లలోనూ ఓపికగా క్రీజులో నిలిచేందుకు మానసికంగా సిద్ధమవ్వాలి. మ్యాచ్‌ మధ్యలో వర్షం కూడా వస్తుండటంతో.. వాతావరణం ఇప్పుడు కీలకం కానుంది. చతేశ్వర పుజారా ఫామ్‌లో లేడు. కానీ.. అతనిలో మంచి డిఫెన్స్, టెక్నిక్ ఉంది. కాబట్టి.. అతను ఎక్కువ సేపు క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించాలి.

'పుజారానే కాదు.. అతనితో పాటు కనీసం మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు కూడా సహనంతో ఆడాలి. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఫలితం చాలా కీలకం. కాబట్టి.. భారత్ ఈ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. బౌలర్లు వారి పని పూర్తి చేశారు. ఇప్పుడు బ్యాట్స్‌మెన్స్ వంతు' అని గంభీర్ వెల్లడించాడు.

Story first published: Sunday, August 12, 2018, 20:34 [IST]
Other articles published on Aug 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+