భారత్ జట్టు 289 పరుగుల ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్లో తొలుత సమం చేసి.. ఆ తర్వాత ఆ జట్టుకి టార్గెట్ని నిర్దేశించడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు మ్యాచ్ను కాపాడుకునేందుకు భారత్ ముందున్న ఏకైక దారి.. ఐదు సెషన్లలోనూ బ్యాటింగ్ చేసి మ్యాచ్ని డ్రాగా ముగించడం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 107 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్ 396/7తో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
'ఇంగ్లాండ్ జట్టుకి భారీ ఆధిక్యం లభించిన నేపథ్యంలో.. మ్యాచ్ను కాపాడుకునేందుకు భారత బ్యాట్స్మెన్లు ఇక మిగిలిన ఐదు సెషన్లలోనూ ఓపికగా క్రీజులో నిలిచేందుకు మానసికంగా సిద్ధమవ్వాలి. మ్యాచ్ మధ్యలో వర్షం కూడా వస్తుండటంతో.. వాతావరణం ఇప్పుడు కీలకం కానుంది. చతేశ్వర పుజారా ఫామ్లో లేడు. కానీ.. అతనిలో మంచి డిఫెన్స్, టెక్నిక్ ఉంది. కాబట్టి.. అతను ఎక్కువ సేపు క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించాలి.
'పుజారానే కాదు.. అతనితో పాటు కనీసం మరో ఇద్దరు బ్యాట్స్మెన్లు కూడా సహనంతో ఆడాలి. ఐదు టెస్టుల సిరీస్లో రెండో టెస్టు మ్యాచ్ ఫలితం చాలా కీలకం. కాబట్టి.. భారత్ ఈ మ్యాచ్ను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. బౌలర్లు వారి పని పూర్తి చేశారు. ఇప్పుడు బ్యాట్స్మెన్స్ వంతు' అని గంభీర్ వెల్లడించాడు.