న్యూఢిల్లీ: అతిగా అప్పీలు చేయడంలో పాక్ ఆటగాళ్లందరూ సిద్ధహస్తులని, ప్రత్యేకించి కమ్రాన్ అక్మల్ ఆ కళలో నిష్ణాతుడని టీమ్ ఇండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. కీపింగ్ చేస్తున్నపుడు కమ్రాన్ పెద్దగా అరుస్తాడు. పదేపదే అప్పీల్ చేస్తాడు. ధోనీ ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. కమ్రాన్ ఒక్కడే కాదు పాక్ ఆటగాళ్లంతా ఇంతేనని విమర్శించాడు. గతంలో అఫ్రిది చేసిన విమర్శలను గంభీర్ తిప్పికొట్టాడు. ప్రపంచకప్ విజయాన్ని ముంబయి టెర్రరిస్టు దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి అంకితమిస్తున్నట్లు గంభీర్ ప్రకటించాడు. దీనికి స్పందించిన అఫ్రిది భారతీయులను విశాల హృదయం లేనివారిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఆ ప్రస్తావన రాగానే గౌతముడు గంభీరుడయ్యాడు. వ్యక్తిగతంగా టెర్రరిస్టు దాడుల బాధితులకు సమర్పించిన నివాళి అది. పరిణితి చెందనిది అఫ్రిదే. అతనింకా పదహారేళ్ల కుర్రాడిలా మాట్లాడుతున్నాడుఅని విమర్శించాడు. #13;