కోల్ కతా: హైదరాబాద్ లో జరిగే చాంపియన్స్ లీగ్ టి-20 అర్హత మ్యాచ్ లకు గౌతమ్ గంభీర్ దూరమయ్యాడు. సెప్టెంబర్ 19-21 వరకు జరిగే అర్హత మ్యాచ్ లకు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ దూరమైనట్లు జట్టు ప్రతినిధి వెంకీ మైసుర్ తెలిపారు. ఇంగ్లండ్ తో ఓవల్ లో జరిగిన చివరి టెస్టులో గాయపడిన గంభీర్ పూర్తిగా కోలుకోలేదన్నాడు. గంభీర్ స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ సారథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికా ఆటగాడు కలిస్ చేపట్టనున్నాడు. ఇప్పటికే ఇయాన్ మోర్గాన్ గాయంతో చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ కు దూరమయ్యాడు. ఇండియా-ఇంగ్లాండ్ మద్య జరిగిన టెస్టు సిరిస్ సందర్బంలో క్యాచ్ పట్టబోయి గౌతమ్ గంభీర్ గాయాలు పాలవ్వడం జరిగిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగే ఐదు వన్డేలు, టి20 మ్యాచ్ కు దూరం అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ నుండి వచ్చిన వెంటనే గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ నరాల నిపుణుడిని కలవడం కూడా జరిగింది. డాక్టర్ గౌతమ్ గంభీర్ యొక్క ప్రొగ్రస్ ని చూసి ఆనందించడమే కాకుండా ఫిజికల్ ట్రైనింగ్ ని మొదలుపెడితే త్వరలోనే పూర్తి ఫిట్ నెస్ ని సాధించవచ్చు అన్న నమ్మకాన్ని తెలియజేశారు. దీంతో సెప్టెంబర్ 23నుండి జరగనున్న ఛాంపియన్స్ అసలు ట్రోఫీకి అందుబాటులోకి రావడం జరుగుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ సిఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ ఛాంపియన్స్ టి20 లీగ్ లో ఆటగాళ్లు ఆడాలా వద్దా అనేది పూర్తిగా వారికే వదిలేశామని తెలిపారు. వీరితో పాటు కోల్ కత్తా నైట్ రైడర్స్ కోచ్ వాట్ మోర్ కూడా గంభీర్ త్వరగా కోలుకోవాలని ఆశించారు. #13;