హైదరాబాద్: రంజాన్ వేడుకలు పురస్కరించుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నుంచి టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు పలువురు క్రికెటర్లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుంది. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలువురు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నగరంలోని మక్కా మసీదు వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక మీర్ ఆలం ఈద్గాలో ఖురాన్ ప్రవచనాలకు భారీ సంఖ్యలో ముస్లింలు తరలి వచ్చారు.