మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాల్లో క్రికెట్ అభిమానులు తరుచూ వినే మాట 'డక్వర్త్ లూయిస్ పద్ధతి'. దీని ప్రకారం లక్ష్యాన్ని కుదించారని, ఓవర్లు తగ్గించారని తరుచూ వింటుంటాం. అయితే ఈ డక్వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ కన్నుమూశారు. ఈ నెల 21న డక్వర్త్ మరణించారు. వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
కాగా, 84 ఏళ్ల డక్వర్త్ మరణవార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఓ ప్రముఖ వెబ్సైట్ మంగళవారం ఆయన మరణవార్తను తెలిపింది. ఇంగ్లండ్కు చెందిన డక్వర్త్ గణాంక నిపుణుడు.ఆయన టోనీ లూయిస్తో కలిసి డీఎల్ఎస్ పద్ధతిని ఆయన రూపొందించారు. వరుణుడు ఆటంకం కలిగించే మ్యాచ్ల్లో ఫలితం తేలడానికి కొత్త సమీకరణం తీసుకువచ్చారు.

అంతకుముందు వర్షం కారణంగా ఆటంకం కలిగితే మ్యాచ్ను రద్దు చేసేవారు. కానీ డక్వర్త్-లూయిస్ తీసుకువచ్చిన పద్ధతితో విజేతను నిర్ణయించడానికి అవకాశం లభించింది. డీఎల్ఎస్ పద్ధతిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1997లో తొలిసారిగా అమలు చేసింది. అనంతరం వర్షప్రభావిత మ్యాచ్ల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది.
అయితే ఈ డక్వర్త్ లూయిస్ పద్ధతికి తదనంతరం ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్)గా నామకరణం చేశారు. కాగా, లూయిస్ 2020లో కన్నుమూశారు. అయితే ఈ డీఎల్ఎస్ పద్ధతి కొన్ని జట్లకు వరంగా, కొన్ని జట్లకు శాపంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించలేని సందర్భాల్లో అప్పటివరకు విజయం దిశగా దూసుకెళ్తున్న జట్లు ఎన్నోసార్లు ఓటమి చవిచూశాయి. ఈ సందర్భాలు చాలా తక్కువ.