
ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్లో రోహిత్
ఈ ఏడాది ఆరంభంలో సఫారీ పర్యటనకు ఎంపికైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్, వెస్టిండిస్లతో ఆడిన టెస్టు సిరిస్లకు రోహిత్ శర్మను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్, వెస్టిండిస్తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అద్భుత ప్రదర్శన చేయడంతో మరోసారి అతడికి ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు టెస్టు జట్టులో చోటు కల్పించారు.

వార్మప్ మ్యాచ్లో గాయపడ్డ పృథ్వీ షా
ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు జట్టులో పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో ఓపెనర్లను ఎంపిక చేశారు. దీంతో రోహిత్ శర్మ మళ్లీ మిడిలార్డర్లోనే ఆడతాడని అభిమానులంతా భావించారు. అయితే సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్లో పృథ్వీ షా గాయపడటంతో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆసీస్ పర్యటన ఎంతో కీలకం
జట్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్లు సైతం సూచిస్తుండటంతో ఓపెనర్గా రోహిత్ శర్మను తీసుకోవడం టీమిండియాకు అన్ని విధాలా మంచిదేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. ఈ మేరకు మైకేల్ వాన్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
పృథ్వీ షా స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేస్తే
"ఇలాంటి సమయాల్లో పృథ్వీ షా తొలిటెస్టుకు దూరం కావడం బాధాకరమైనదే. అతనిలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉంది. అతడి స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేస్తే జట్టుకు మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. టాప్ ఆర్డర్లో అతడు కచ్చితంగా ఉండాలి. రోహిత్ను తక్కువ అంచనా వేయకూడదు. టెస్టు క్రికెట్లో అతడు మాస్టర్ అని నేను అనడం లేదు. కానీ అతడు చాలా బాగా ఆడతాడు" అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












