హైదరాబాద్: ఓ అల్లరి మూక దాడిలో ఢిల్లీలో టీమిండియా మాజీ పేసర్ అమిత్ భండారి తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్ర అండర్-23 జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న భండారి యువ క్రికెటర్ల ఆటని పరిశీలిస్తున్న సమయంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది.
బంతి ముఖానికి తగిలడంతో పిచ్పై కూలబడ్డ పేసర్ దిండా (వీడియో)
ఈ ఘటనలో అమిత్ భండారి తల, చెవి భాగంలో గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. జట్టులోకి ఎంపికవని ఓ యువ క్రికెటర్ తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
The goons threatened to 'kill' @delhi_cricket selectors for ignoring the boy. The other two selectors also we're getting threatened. A group of 25 people came attacking @Amitbhandari110. He got 7 stitches and cuts on knee, head. Police has taken his statement.@Wahcricketlive pic.twitter.com/BXyRUAYkAG
— G. S. Vivek (@GSV1980) February 11, 2019
ఢిల్లీ అండర్-23 టీమ్ మేనేజర్ శంకర్ సైనీ వెల్లడించిన వివరాల ప్రకారం "టీమ్ ట్రయల్స్ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని అన్నారు.
"కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా ఓ 15 మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. అదే సమయంలో అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే భండారీని వారు గాయపర్చారు. ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్తూ.. జట్టులోకి తీసుకోలేదో? కాల్చి పారేస్తాం అని భండారీని హెచ్చరించారు" అని ఆయన తెలిపారు.
Absolutely unpardonable..these hooligans must be brought to book ASAP to bring sanity in Selection Proceedings..no violence cn be tolerated to push fr selection no matter how deserving..DDCA wake up & ACT kindly..Crkt Fraternity demands swift official stand..!!
— Bishan Bedi (@BishanBedi) February 11, 2019