హైదరాబాద్: సఫారీ జట్టు పర్యటనలో అద్భుతంగా దూసుకుపోతోన్న భారత జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు సిన్నర్లు. సఫారీ గడ్డపై కుల్దీప్ యాదవ్, చాహల్ సంయుక్తంగా ఇప్పటికే 33 వికెట్లు పడగొట్టి భారత విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య మైదానంలో చాహల్ కళ్లజోడుతో కనిపిస్తున్నాడు.
Be cool
— Sir Yuzvendra chahal (@SirChahal) February 20, 2018
Stay tough '''#TuesdayThoughts @khushikadri #INDvSA #chahal @yuzi_chahal @imanveergurjar @ImRo45 @imVkohli @ashwinravi99 @hardikpandya7 @krunalpandya24 pic.twitter.com/Xauyv9ot8d
ఇదేమైనా స్టైల్ కోసమా.. అంటే కాదంట. దీనిపై వివరణ కోసం ఇప్పటికే అభిమానులు తీవ్ర శోధన చేసినా ఫలితం రాలేదు. చివరికి ఈ విషయంపై చాహల్ తండ్రి వివరణ ఇచ్చారు. మంగళవారం చాహల్ తండ్రి కేకే చాహల్ మీడియాతో మాట్లాడుతూ.. 'దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు కంటి సంబంధిత వైద్యుల్ని చాహల్ సంప్రదించగా.. అప్పుడప్పుడు అద్దాలు ధరించాలని వారు సూచించారు.
#INDvSA: @msdhoni should be credited for half of @yuzi_chahal and @imkuldeep18's wickets, says former India cricketer#SAvIND #Dhoni #Chahal #KuldeepYadav
— CricketNDTV (@CricketNDTV) February 14, 2018
READ: https://t.co/y5T0M8Oy0X pic.twitter.com/svjupbjTug
పరీక్షల్లో అతనికేమీ కంటి చూపు లోపం ఎక్కువగా లేదని వైద్యులు తేల్చారు. కానీ.. త్వరలోనే ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్న చాహల్.. ఉద్యోగ సంబంధిత వైద్య పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో ఈ పరీక్షల్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే అద్దాలు ధరిస్తే మంచిదని వైద్యులు సూచించారు.
ఈ కారణంగానే చాహల్ ఇప్పుడు మైదానంలో అద్దాలతో కనిపిస్తున్నాడు. అయితే.. బౌలింగ్, బ్యాటింగ్ సమయంలో వాటిని పక్కన పెడతాడు' అని చాహల్ తండ్రి కేకే చాహల్ వెల్లడించాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 బుధవారం రాత్రి జరగనుంది.