For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిచ్చి ప్రేలాపనతో పైశాచిక ఆనందం: ఇంజనీర్ 'చెత్త' వ్యాఖ్యలపై ఎమ్మెస్కే ఆగ్రహం

Feel sad for someone deriving sadistic pleasure: MSK Prasad slams Farokh Engineer on cups of tea comment

హైదరాబాద్: 2019 వరల్డ్‌కప్ సందర్భంగా సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు టీలు అందించడం తాను చూశానని టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఫరూక్‌ ఇంజినీర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీని మిక్కీ మౌస్‌ సెలక్షన్‌ కమిటీ అని, కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లు వినే ఒక చేతగాని కమిటీ అంటూ విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఫరూక్ ఇంజనీర్ చేసిన వ్యాఖ్యలపై ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఎమ్మెస్కే మాట్లాడుతూ "ఫరూక్ మాటలతో నేను బాధపడుతున్నాను. ఆయన తన పనికిరాని ఆరోపణల ద్వారా భారత కెప్టెన్ యొక్క సెలెక్టర్లు మరియు భార్యను అగౌరవపరిచారు. భారత కెప్టెన్‌, అతడి భార్య కూర్చున్న బాక్స్‌లో ఏ భారత సెలక్టర్‌ కూడా కూర్చోలేదు" అని అన్నాడు.

పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం

పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం

"ఏదో పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. తప్పుడు ఆరోపణలతో భారత సెలక్టర్లతో పాటు కెప్టెన్‌ భార్య పరువు కూడా తీస్తున్నారు. సెలక్షన్ కమిటీని సరైన ప్రక్రియ ద్వారా బీసీసీఐ తమను సెలక్టర్లుగా నియమించిన విషయం మరువొద్దు. 82 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి దానికి తగినట్లుగా వ్యవహరించాలి" అని ఎమ్మెస్కే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

గురువారం పుణెలోని వెంగసర్కార్‌ క్రికెట్‌ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూక్‌ ఇంజనీర్ మాట్లాడుతూ ‘‘మనకు మిక్కీ మౌస్‌ సెలక్షన్‌ కమిటీ ఉంది. సెలక్షన్‌ ప్రక్రియపై కోహ్లీ ప్రభావం ఉండడం మంచిదే. కానీ సెలక్టర్లకు ఆ పదవికి తగిన అర్హత ఉందా? అందరూ కలిసి 10-12 టెస్టులే ఆడారు'' అని ఫరూక్‌ అన్నాడు. ‘‘నాకు ఆ సెలక్టర్‌ పేరు కూడా తెలియదు. ప్రపంచకప్‌ సందర్భంగా అతడు ఇండియా బ్లేజర్‌ వేసుకుంటే ‘ఎవరు నువ్వు' అని అడిగా. తాను సెలక్టర్‌నని అతడు చెప్పాడు. అనుష్క శర్మకు టీలు తెచ్చివ్వడమే అక్కడ సెలక్టర్లు చేస్తున్న పని'' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అనుష్క శర్మ సైతం ట్విట్టర్‌లో

ఈ వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్కక్తం చేసింది. "విమర్శలు చేసేవారు చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంది. అన్ని నిజాలు అయినట్టు ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న వార్తలు చూసి భయపడుతున్నా. అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉన్నా. ప్రతీ విషయానికి మాట్లాడకుండా ఉంటే.. పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలని స్పందిస్తున్నా. కోహ్లీ ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లీ వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన వివాదాల్లోకి తరచు నన్ను లాగుతున్నారు. మీ అందరికీ నేనే దొరికానా. జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు. కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే వెళుతున్నా. ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశా. సెలెక్టర్ల బాక్స్‌లో నేను కూర్చోలేదు. మీరు సెలెక్షన్‌ కమిటీపైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ.. వివాదాల్లోకి నా పేరును లాగొద్దు. దురుద్దేశంతో కూడిన వ్యవహారాల్లో నా పేరును వాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. వాస్తవాలను మాట్లాడండి. ఆధారాలతో మాట్లాడండి. నన్ను ఇక్కడితో వదిలేయండి" అని అనుష్క శర్మ అన్నారు.

Story first published: Friday, November 1, 2019, 12:00 [IST]
Other articles published on Nov 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+