కివీస్తో జరిగిన రెండో టీ20లో భారత్ గెలిచినా ఫ్యాన్స్ ఏమాత్రం సంతోషంగా లేరు. టీమిండియా పరమ చెత్తగా ఆడింంటూ మండిపడుతున్నారు. దానికితోడు మొత్తం యువకులు ఉన్న జట్టు పేలవంగా ఆడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో భారత మహిళల్ అండర్ 19 జట్టు వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. న్యూజిల్యాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మహిళలు అయితే 17 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించేవారంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్నో మ్యాచ్ ఆరంభం నుంచి భారత జట్టు చాలా నెమ్మదిగా ఆడింది. బౌలింగ్ అదభుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ విభాగం మాత్రం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరు పరమ చెత్తగా ఆడారు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ జట్టు వంద పరుగులు కూడా చేయలేకపోయింది. బౌలర్లు అంత అద్భుతంగా ఆ జట్టును కట్టడి చేశారు. అయితే ఛేజింగ్లో భారత బౌలర్లు కూడా చాలా నెమ్మదిగానే ఆడారు. ముఖ్యంగా ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ పరమ చెత్తగా టెస్టు మ్యాచ్ తరహాలో ఆడారు. దీంతో స్వల్ప లక్ష్య ఛేదనలో కూడా టీమిండియా చెమటలు కక్కాల్సి వచ్చింది. దీనిపై అభిమానులు ఎమాత్రం సంతోషంగా లేరు.
వంద పరుగుల టార్గెట్ను ఛేదించడానికి భారత్ మొత్తం 20 ఓవర్లు ఆడింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఈ జట్టుపై మండిపడుతున్నారు.