దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్, సౌత్ జోన్ తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ టోర్నీ సెమీఫైనల్లో జరిగిన ఒక షాకింగ్ ఘటనపై జర్చలు ముమ్మరం అవుతున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని నార్త్ జోన్ తప్పుడు పనులు చేసింది. సౌత్ జోన్ టార్గెట్ను ఛేజ్ చేస్తుండగా.. వాళ్లను అడ్డుకునేందకుకు నార్గ్ జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ ఒక కుట్ర పన్నాడు.
మ్యాచ్ చివరి సెషన్లో ఏకంగా 53 నిమిషాలకు కేవలం 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంత దారుణంటా టైం వేస్ట్ చేయడం చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాటి వారిని కఠినంగా శిక్షించాలని, లేదంటే అందరూ ఇలాగే తొండాట ఆడతారని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

నార్త్, సౌత్ జోన్ మధ్య జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో చాలా డ్రామా కనిపించింది. ఇక చివరి సెషన్లో జయంత్ యాదవ్ అండ్ కో ఆడిన తొండాట ఈ మ్యాచ్కే హైలైట్. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ గణేష్ దొడ్డ కూడా ప్రశ్నించాడు. అద్భుతమైన విజయం సాధించిన సౌత్ జోన్ను మెచ్చుకున్న ఆయన.. ఇకపై అయినా ఇలా ఒక టీం క్రీడాస్ఫూర్తి లేకుండా అడ్వాంటేజ్ సాధించడానికి వాడుతున్న ట్రిక్స్ను బీసీసీఐ సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
'వెల్డన్ అబ్బాయిలు. టైం వేస్ట్ చేయడానికి నార్త్ జోన్ ఎన్ని వేషాలు వేసినా అద్భుతంగా ఆడి గెలిచారు. ఇకపై ఇలా ఏమాత్రం క్రీడాస్ఫూర్తి లేకుండా ప్రవర్తించే ప్రేయర్లపై అధికారులు చర్యలు తీసుకుంటే మంచిది' అని దొడ్డ గణేష్ ట్వీట్ చేశాడు. మ్యాచ్లో అడ్వాంటేజ్ పొందడానికే నార్త్ జోన్ ఇంతలా చివర్లో టైం వేస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ కూడా చాలా తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు.